టాలీవుడ్
సినిమా పరిశ్రమలో దర్శకుడు పూరీ జగన్నాథ్ కు రచయితగా దర్శకుడిగా ఎన్నో గొప్ప పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి. దర్శకుడి కంటే రచయితగానే ఎక్కువ గా ప్రేక్షకుల పై ప్రభావం చూపిస్తాడు పూరీ. ఆయన సినిమాల్లో
హీరో పాత్రలు వెరైటీగా ఎంత విభిన్నంగా ఉంటాయో మాటలు కూడా డైలాగులు కూడా అంతే విభిన్నమైన విధంగా రాస్తాడు. అందుకే
పూరి జగన్నాథ్ లో దర్శకుడి కంటే
రచయిత నే ప్రేక్షకులకు ఎంతగానో నచ్చుతాడు. అందుకే ఆయన
సినిమా లు తప్పకుండా ప్రేక్షకులను అలరించే విధంగా ఉంటాయి.
ఫలితం సంగతి పక్కన పెడితే ఏదో ఒక మంచి పాయింట్ ను సినిమాలో చూపిస్తూ ఆ
సినిమా తో సూపర్ హిట్ అందుకుని ఆ విజయాన్ని తన ఖాతాలో వేసుకుంటాడు. అందుకే హీరోలకు సమానంగా భారీ డిమాండ్ ఏర్పడింది
పూరి జగన్నాథ్ కి. ఆయన ప్రస్తుతం
విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న లైగర్ సినిమాకు దర్శకత్వం చేస్తున్నాడు. ఈ
సినిమా లో బాక్సింగ్
ఛాంపియన్ మైక్ టైసన్ కూడా నటిస్తున్నట్లు ఇటీవల చిత్రబృందం అధికారిక ప్రకటన ఇచ్చింది.
అనన్య పాండే హీరోయిన్ గా నటించిన ఈ
సినిమా కి ఛార్మి,
కరణ్ జోహార్ ,
అపూర్వ మెహత లు నిర్మాతలు.
ఇదిలా ఉంటే తాజాగా సోషల్ మీడియాలో
మెగాస్టార్ గాడ్
ఫాదర్ సినిమాకి
పూరి జగన్నాథ్ సహాయం చేశాడు అనే వార్తలు వినిపిస్తున్నాయి. గతంలో
చిరంజీవి 150వ
సినిమా చేయాలని
పూరి జగన్నాథ్ చాలా తాపత్రయ పడ్డాడు. చివరికి ఎన్ని ప్రయత్నాలు చేసినా
చిరంజీవి ఆయనతో
సినిమా చేయలేదు. అయితే అప్పుడు పనికిరాని
పూరి జగన్నాథ్ లోని
రచయిత ఇప్పుడు ఎలా ఉపయోగ పడింది అని
పూరి జగన్నాథ్ అభిమానులు కొంత అసహనం వ్యక్తం చేస్తున్నారు.
మెగాస్టార్ చిరంజీవి ఈ విధంగా అవసరమైనప్పుడు
పూరి ని వాడుకుని ఆ తర్వాత పట్టించుకోకపోవడం వారిని తీవ్రంగా కలిచివేసింది.