ఈ సినిమాను ఫోర్త్ డైమెన్షన్ ఫిల్మ్స్ వారు తెరకెక్కించారు. ఈ సినిమాలో వెన్నెల కిషోర్, శర్వానంద్, బ్రహ్మానందం ,రవివర్మ తదితర ప్రముఖులు నటించి ఈ సినిమాకు హైలెట్ గా నిలిచారు. ఇకపోతే ఈ సినిమా తర్వాత అందరికీ మంచి ఆఫర్లే వచ్చాయని చెప్పాలి. నట హాస్య బ్రహ్మానందం ఈ సినిమాకు ప్రధాన సూత్రధారులు అయితే ఆ తర్వాత వచ్చింది వెన్నెల కిషోర్.. వెన్నెల కిషోర్ వేషధారణ, యాక్టింగ్ ,టైమింగ్ కి తగ్గ కామెడీ డెలివరీ ఇలా ప్రతి ఒక్కటి కూడా ప్రేక్షకులను అలరించాయి.
2005 నవంబర్ 26వ తేదీన విడుదలైన ఈ చిత్రం యువతులు విదేశాలలో ఎలా జీవిస్తారు అనే విషయాలను తెరకెక్కించడం తో.. ఈ సినిమాకు యువత బాగా కనెక్ట్ అయింది. అంతే కాదు కడుపుబ్బా నవ్వించే సన్నివేశాలు, ఫ్యామిలీ ఆడియెన్స్ ను కూడా బాగా ఆకట్టుకున్నాయి. శర్వానంద్ , రాజా హీరోలుగా అడుగుపెట్టారు.. ప్రస్తుతం రాజా సినీ ఇండస్ట్రీకి దూరమైనా మత ప్రచారం చేసుకుంటూ సినిమా అంటేనే మాయ అంటూ చెప్పుకొస్తున్నాడు. ఇక శర్వానంద్ ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్న అప్పటికీ ఇప్పుడు విజయం సాధించడం కోసం మరో హీరో సిద్ధార్థతో కలిసి మహా సముద్రం సినిమాతో స్క్రీన్ షేర్ చేసుకుంటున్నాడు.
మల్టీస్టారర్ మూవీగా తెరకెక్కుతున్న ఈ చిత్రం ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో మనం వేచి చూడాల్సిందే.