అందాల ముద్దు గుమ్మ త్రిష గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. నువ్వొస్తానంటే నేనొద్దంటానా, వర్షం, బుజ్జిగాడు ,పౌర్ణమి, తీన్మార్, స్టాలిన్, కింగ్ వంటి పలు చిత్రాలతో నటించి తెలుగు ప్రేక్షకులను ఎంతగానో అలరించింది. అలా వరుస స్టార్ హీరోల సినిమాలలో నటించి టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ స్థానాన్ని చేరుకుంది. అలా టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ స్థానాన్ని అందుకున్న త్రిష ఆ తర్వాత మాత్రం తెలుగులో పెద్దగా సినిమాలు చేయడం లేదు అని చెప్పవచ్చు. ఎక్కువ శాతం తమిళ సినిమాలలో నటించడానికి ఆసక్తి చూపిస్తున్న ఈ ముద్దుగుమ్మ తమిళ్ లో తాను నటించిన సినిమాలను తెలుగులోకి డబ్ చేసి విడుదల చేస్తూ తెలుగు ప్రేక్షకులను ఆకర్షిస్తుంది.

ఇది ఇలా ఉంటే త్రిష ప్రస్తుతం పొన్నియిన్‌ సెల్వన్‌ చిత్రంలో నటిస్తోంది. మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో విక్రమ్, కార్తీ, జయం రవి, ఐశ్వర్యా రాయ్, త్రిష, ఐశ్వర్యా లక్ష్మీ, శోభితా ధూలిపాళ్ళ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. చాలా భారీ తారాగణంతో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ ఈ మధ్యనే పూర్తి అయ్యింది. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ సినిమాలో చోళ రాణి కుందవై పాత్ర చేసిన త్రిష ‘చోళ రాణి స్పీకింగ్‌’ అంటూ ప్రస్తుతం ఆ పాత్రకు డబ్బింగ్‌ చెబుతున్నారు. వాస్తవానికి ముద్దు గుమ్మ త్రిష మాతృ భాష తమిళం అయినప్పటికీ తన పాత్రకు తాను పెద్దగా డబ్బింగ్ చెప్పుకోరు. ఇప్పటి వరకు తెలుసా త్రిష ఓ అయిదు సినిమాలకు మాత్రమే డబ్బింగ్ చెప్పుకుంది అట, చాలా రోజుల తర్వాత మళ్లీ తన పాత్రకు త్రిష సొంతంగా డబ్బింగ్‌ చెప్పుకుంటున్న సినిమా ‘పొన్నియిన్‌ సెల్వన్‌’ అని కోలీవుడ్‌లో  టాక్ నడుస్తుంది. రెండు భాగాలుగా విడుదల కానున్న ఈ సినిమా మొదటి భాగం వచ్చే సంవత్సరం వేసవిలో విడుదల కానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: