మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం మెహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న బోలా శంకర్ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు, ఈ సినిమాలో తమన్నా హీరోయిన్ గా నటించబోతోంది. తమిళ సూపర్ హిట్ మూవీ వేదాళం కు తెలుగు రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో చిరంజీవికి చెల్లెలుగా కీర్తి సురేష్ నటించబోతుంది, ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా చిరంజీవి, కీర్తి సురేష్ లకు సంబంధించిన ఒక వీడియోను చిత్ర బృందం విడుదల చేయగా దీనికి జనాల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. 11 నవంబర్ 2021 గురువారం రోజు పూజా కార్యక్రమాలతో ప్రారంభం అయిన బోలా శంకర్ సినిమా రెగ్యులర్ షూటింగ్ నవంబర్ 15 నుండి ప్రారంభం కాబోతుంది. ఇది ఇలా ఉంటే ఈ సినిమా వేదాళం కు రీమేక్ గా తెరకెక్కుతున్నప్పటికి కథలో చాలా మార్పులు చేసినట్లు తెలుస్తోంది.

 ఈ కథ లో మార్పులు, చేర్పుల కోసం మెహర్ రమేష్ దాదాపు సంవత్సరంన్నర పాటు కష్టపడ్డాడట. ఇలా రీమేక్ కథ అయినప్పటికీ అనేక మార్పులు, చేర్పులతో తెలుగు నేటివిటీకి తగ్గట్టు, మెగాస్టార్ చిరంజీవి ఇమేజ్ కు ఏ మాత్రం తగ్గకుండా, అలాగే మెగా అభిమానులు ఎక్స్పెక్టేషన్స్ ను రీచ్ అయ్యే రేంజ్ లో ఈ కథను మెహర్ రమేష్ రెడీ చేసినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆచార్య సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నాడు. ఈ సినిమా తో పాటు గాడ్ ఫాదర్ సినిమా షూటింగ్ ను కూడా మెగాస్టార్ చిరంజీవి శరవేగంగా పూర్తి చేస్తున్నాడు. ఈ సినిమాలతో పాటు చిరంజీవి బాబీ దర్శకత్వంలో movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో కూడా ఒక సినిమాలో నటించడానికి రెడీగా ఉన్నాడు, ఈ సినిమా పూజా కార్యక్రమాలు కూడా కొన్ని రోజుల క్రితమే పూర్తి అయ్యాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: