బాలయ్య - బోయపాటి కాంబోలో వచ్చిన సింహా - లెజెండ్ రెండు సినిమాలు సూపర్ హిట్ అవ్వడంతో అఖండ ఖచ్చితంగా హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్ అవుతుందని అంటున్నారు. ఇక ఈ సినిమా పై భారీ ఎత్తున ప్రమోషన్లు నడుస్తున్నాయి. అయితే దర్శకుడు బోయపాటి శ్రీను మాత్రం ఇప్పటి వరకు నోరు మెదపడం లేదు. బోయపాటి ఇంత సైలెంట్ గా ఉండడం .... తనదైన స్టైల్లో మాట్లాడకపోవడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.
పైగా ఇటీవల జరిగిన అఖండ ప్రి రిలీజ్ ఫంక్షన్ లో బోయపాటి తాను సినిమా రిలీజ్ అయ్యాకే మాట్లాడ తాను అని చెప్పారు. అయితే దీనికి కారణం లేక పోలేదని కొందరు చర్చించు కుంటున్నారు. గతంలో వినయ విధేయ రామ విషయంలో బోయపాటి భారీ అంచనాలతో మాట్లాడారు. అయితే సినిమా రిలీజ్ అయ్యాక ఆ సినిమా ప్లాప్ టాక్ తెచ్చు కోవడంతో బోయపాటి దారుణ మైన ట్రోలింగ్ కు గురయ్యారు.
ఆ సినిమా విషయంలో చెప్పినదొకటి.. జరిగింది ఒకటి కావడంతో విపరీతమైన నెగిటివిటి బోయపాటికి వచ్చింది. అందుకే ఇప్పుడు అఖండ విషయంలో బోయపాటి చాలా సైలెంట్ గా ఉంటున్నట్టు తెలుస్తోంది. సినిమా రిలీజ్ అయ్యి హిట్ టాక్ వచ్చాక.. ఆ సక్సెస్ ఫంక్షన్లో మాత్రమే మాట్లాడి తానేంటో ఫ్రూవ్ చేసుకోవాలన్న కసితో బోయపాటి ఉన్నారు. అందుకే ఆయన మౌనంగా ఉంటున్నారని తెలుస్తోంది. అఖండ ఓవర్సీస్ లో 500 స్క్రీన్లలో రిలీజ్ అవుతోంది.