ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా టాలీవుడ్ దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఈ సినిమా మోషన్ పోస్టర్ ను లాంచ్ చేశారు. ఇప్పటి వరకు ఈ సినిమాకు సంబంధించిన ఎటువంటి అప్డేట్స్ లేకపోవడంతో అభిమానులు నిరుత్సాహ పడ్డారు. తాజాగా ఈ సినిమా కథాంశాన్ని చెప్పకముందే మోషన్ పోస్టర్ ను విడుదల చేయడంతో ఒక్కసారిగా అంచనాలను పెంచేసింది. సోషియో ఫాంటసీ నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుందిఈ కార్యక్రమంలో భాగంగా దర్శకధీరుడు రాజమౌళి ఈ సినిమా గురించి, దర్శకుడు అయాన్ గురించి పలు ఆసక్తికర విషయాల గురించి వెల్లడించారు.
ఇది ఇలా ఉంటే ఈ కార్యక్రమం లో హీరో రణ్ బీర్ కపూర్ రాజమౌళి కాళ్ళు మెక్కడం హాట్ టాపిక్ గా మారింది.ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది రణ్బీర్ కపూర్ చేసిన పనికి నెటిజన్స్ అతడిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఈ సినిమా రెండు భాగాలుగా తెరకెక్కనున్న విషయం తేలిసిందే.ఇందులో ఫస్ట్ పార్ట్ వచ్చే ఏడాది సెప్టెంబర్ 9న విడుదల కానుంది . పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా రూపొందుతుండడంతో ఈ సినిమాను మిగిలిన భాషలలో రాజమౌళి రూపొందిస్తున్నారు.