రణ్ బీర్ కపూర్, ఆలియా భట్ హీరో హీరోయిన్ లుగా తెరకెక్కుతున్న చిత్రం బ్రహ్మాస్త్ర. ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, డింపుల్ కపాడియా, అక్కినేని నాగార్జున ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాకు అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నారు. అయితే ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ కూడా పూర్తి అయినట్లు వార్తలు వినిపించాయి. పాన్ ఇండియా లెవెల్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా 2022 సెప్టెంబర్ 9న థియేటర్లలో గ్రాండ్ గా విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన ప్రెస్ మీట్ ను తాజాగా హైదరాబాదులో ఏర్పాటు చేశారు.

ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా టాలీవుడ్ దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఈ సినిమా మోషన్ పోస్టర్ ను లాంచ్ చేశారు. ఇప్పటి వరకు ఈ సినిమాకు సంబంధించిన ఎటువంటి అప్డేట్స్ లేకపోవడంతో  అభిమానులు నిరుత్సాహ పడ్డారు. తాజాగా ఈ సినిమా కథాంశాన్ని చెప్పకముందే మోషన్ పోస్టర్ ను విడుదల చేయడంతో ఒక్కసారిగా అంచనాలను పెంచేసింది. సోషియో ఫాంటసీ నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా షూటింగ్‌ శరవేగంగా జరుగుతుందిఈ కార్యక్రమంలో భాగంగా దర్శకధీరుడు రాజమౌళిసినిమా గురించి, దర్శకుడు అయాన్ గురించి పలు ఆసక్తికర విషయాల గురించి వెల్లడించారు.

ఇది ఇలా ఉంటే ఈ కార్యక్రమం లో హీరో రణ్ బీర్ కపూర్ రాజమౌళి కాళ్ళు మెక్కడం హాట్ టాపిక్ గా మారింది.ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది రణ్బీర్ కపూర్ చేసిన పనికి నెటిజన్స్ అతడిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఈ సినిమా రెండు భాగాలుగా తెరకెక్కనున్న విషయం తేలిసిందే.ఇందులో ఫస్ట్ పార్ట్ వచ్చే ఏడాది సెప్టెంబర్ 9న విడుదల కానుంది . పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా రూపొందుతుండడంతో ఈ సినిమాను మిగిలిన భాషలలో రాజమౌళి రూపొందిస్తున్నారు.         

మరింత సమాచారం తెలుసుకోండి: