ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో సాయి పల్లవి హవా మామూలుగా లేదనే చెప్పాలి. వరుస సినిమాలతో మంచ్చి విజయాలని సొంతం చేసుకుంది. అయితే మలయాళ సినిమా ఇండస్ట్రీకి చెందిన సాయి పల్లవికి సొంత భాషలో కంటే ఇప్పుడు తెలుగు లోనే ఎక్కువ అవకాశాలను అందుకుంటుంది. ఇక తెలుగు ప్రజలు సాయి పల్లవిని తెలుగింటి ఆడపడుచుగా భావిస్తుంటారు.

తెలుగు చిత్ర పరిశ్రమకి ఫిదా సినిమాలో ఆమె తన మెస్మరైజింగ్ నటనతో తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. అలాగే గతేడాది కూడా నాగచైతన్య సరసన లవ్ స్టోరీ సినిమా, నాని సరసన శ్యామ్‌సింగరాయ్‌ సినిమాల్లో నటించి అద్భుతమైన నటనతో ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ పొందుతుంది.

సాయి పల్లవి తెలుగు చిత్ర పరిశ్రమతో పాటు తమిళంలోనూ ఆమెకు స్టార్ హీరోల సరసన వరుసగా అవకాశాలు అందుకుంటుంది. ప్రస్తుతం ఆమె బిజీ షెడ్యూల్ తో మంచి సినిమాలు కూడా వదులుకున్నారు. నానితో కలిసి నటించిన సింగరాయ్ సినిమాలో దేవదాసి పాత్రలో ఆమె నటనకు విమర్శకుల ప్రశసంలు అందుకుంది. సాయి పల్లవి వేణు ఉడుగుల దర్శకత్వంలో విరాటపర్వం సినిమాలో నటిస్తుంది. ఈ సినిమాను నక్సలిజం నేపథ్యంలో తెరకెక్కిస్తున్నారు.

విరాటపర్వం సినిమాలో సాయి పల్లవి  పేదింటి యువతి పాత్రలో నటిస్తున్నారు. వరుస సినిమాలతో బిజీగా ఉన్న సాయిపల్లవి రెమ్యునరేషన్ విషయానికి వస్తే ఆమె ఒక్కో సినిమాకు కోటి నుంచి కోటిన్నర వరకు తీసుకుంటున్నట్లు సమాచారం. ఇక ఆమె నటించిన కొన్ని సినిమాలతో నిర్మాతలకు నష్టం వస్తే ఆమె రెమ్యునరేషన్ తగ్గించుకోవడంతో పాటు తిరిగి ఇచ్చిన సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి.

సాయి పల్లవి కేవలం డబ్బుకోసమే సినిమాలు చేయదు.. పాత్ర తనకు నచ్చితేనే ఆమె సినిమాని ఓకే చెబుతుంది. అంతేకాదు. మె నుంచి ఎక్స్‌పోజింగ్ లాంటి పాత్రలు కూడా చేయడానికి ఇష్టపడదు. తనకి పాత్ర నచ్చకపోవడంతో ఆమె ఇద్దరు స్టార్ హీరోల సినిమాల్లో నటించే అవకాశం వదులుకున్నారు. ఆలా ఆమె 8 కోట్ల వరకు నష్టపోయినట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: