ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా హాట్ అండ్ క్యూట్ బ్యూటీ రష్మిక మందన హీరోయిన్ గా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన హ్యాట్రిక్ సినిమా 'పుష్ప ది రైజ్'. రెండు భాగాలుగా వస్తున్న ఈ చిత్రం మొదటి భాగం 'పుష్ప ది రైజ్' పేరుతో పాన్ ఇండియా లెవెల్లో డిసెంబర్ 17 వ తేదీన ఈ సినిమా చాలా గ్రాండ్ గా విడుదల అయ్యింది.ఇక ఈ భారీ బడ్జెట్ పాన్ ఇండియా సినిమాని పాన్ ఇండియా లెవెల్ లో 'ముత్తంశెట్టి మీడియా' సంస్థతో కలిసి 'మైత్రి మూవీ మేకర్స్' వారు భారీ బడ్జెట్ తో నిర్మించారు. ఇక మొదటి రోజు ఈ చిత్రానికి మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ.. టాక్ తో ఎలాంటి సంబంధం అనేది లేకుండా ఈ సినిమా ఇప్పటికి కూడా రికార్డు స్థాయిలో మంచి వసూళ్ళనే రాబడుతోంది.ఇక మన తెలుగు రాష్ట్రాల్లో అయితే ఈ సినిమాని ప్రేక్షకులు చాలా లైట్ తీసుకున్నారని మొదటి రోజు నుంచి అర్ధం అవుతుంది.

ఎన్నో భారీ అంచనాలతో వచ్చిన ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను నిరాశ పరిచిందని చెప్పాలి.ఇలా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన ఈ 'పుష్ప ది రైజ్' సినిమాకి అన్ని వెర్షన్ లు కూడా కలుపుకుని రూ.145.5 కోట్లు థియేట్రికల్ బిజినెస్ అనేది జరిగింది. ఇక ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలి అంటే రూ.146 కోట్ల దాకా షేర్ ను రాబట్టాలి.ఇక 20 రోజులు పూర్తయ్యేసరికి ఈ సినిమా అన్ని వెర్షన్లు కలుపుకుని రూ.150.25 కోట్ల భారీ షేర్ వసూళ్లను రాబట్టింది.ఇక బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా రూ.4.25 కోట్ల లాభాలను కూడా అందించింది కానీ ఆంధ్రలో బయ్యర్స్ మాత్రం ఈ సినిమాతో భారీగా నష్టపోయారు.ఇక ఈ సినిమా వసూళ్లపై కూడా ఫస్ట్ నుంచి అనేక రకాల అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.ఈ సినిమాకి వచ్చిన వసూళ్లు ఫేక్ అని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.మరి అవి నిజమో కాదో తెలియాలంటే ఈ సినిమా నిర్మాతలు క్లారిటీ ఇవ్వాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: