ముఖ్యంగా ఏపీ ప్రభుత్వం జీవో నెంబర్ 35 ను ప్రవేశపెట్టి సినిమా టికెట్ల ధరలు నిర్ణయించి ఆ ధరల కంటే ఎక్కువగా అమ్మకూడదు అని ఉత్తర్వులు జారీ చేయడంతో పలువురు నిర్మాతలు, ఎగ్జిబిటర్లు హై కోర్టును సైతం ఆశ్రయించారు. విచారణ చేపట్టిన హై కోర్టు ప్రభుత్వం ప్రవేశపెట్టిన జీవోను రద్దు చేసింది.
రామ్గోపాల్ వర్మ ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి పేర్నీ నానితో భేటీలో ఏమి చర్చిస్తారనే దానిపై ఉత్కంఠ నెలకొన్నది. ముఖ్యంగా సినీ ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి లాంటి వారు నేను కేవలం సహాయం చేస్తాను అని, పెద్దరికం చేయను పేర్కొనడం ఇటీవల హాట్టాపిక్. మరొకవైపు చిరంజీవి ప్రకటించిన తరువాత మోహన్బాబు ఓ లేఖ రాయడం ఇక అది సంచలనం అయింది. ఈ తరుణంలోనే వివాదస్పద దర్శకుడు రామ్గోపాల్ వర్మ ఎంట్రీ ఇచ్చి అందరికీ షాక్కు గురి చేసాడు. ఇవాళ జరిగే ఈ భేటీతో కొన్ని రోజులుగా జరుగుతున్న చర్చకు ఫుల్ స్టాప్ పడనున్నదా..? వర్మ ఎలాంటి ప్రశ్నలు సంధించనున్నారు. అందుకు నాని ఎలాంటి సమాధానాలు ఇస్తారో తెలియాలంటే కొద్దిసేపు వేచి చూడాలి మరీ.