మెగా నిర్మాత తనయుడిగా కాదు ఒక స్టార్ హీరోగా అల్లు అర్జున్ రోజు రోజుకి తన క్రేజ్ పెంచుకుంటూ వచ్చాడు. సినిమా కోసం అతను పడే కష్టం.. తపన చూసి అందరు చెబుతుంటే ఏమో అనుకున్నాం కానీ అది కొన్ని సందర్భాల్లో ప్రూవ్ అవుతుంది. పుష్ప లో ఒక సాంగ్ కోసం 12 గంటలు దాదాపు 30 కాటూంస్ మార్చి శభాష్ అనిపించాడు బన్నీ. ఇక తన సినిమానే కాదు మిగతా సినిమాల విషయాల్లో కూడా అల్లు అర్జున్ అంతే నిజాయితీగా ఉన్నాడు. దిల్ రాజు ఇంటి నుండి హీరోగా వస్తున్న ఆశిష్ రౌడీ బోయ్స్ సాంగ్ రిలీజ్ ఈవెంట్ లో పాల్గొన్న బన్నె.. తను ఇక్కడకి గెస్ట్ గా రాలేదు సొంత ఫ్యామిలీ ఫంక్షన్ కి వచ్చానని అన్నారు. ఇది తన బాధ్యత అని అన్నారు.

ఆర్య తీసిన సుకుమార్ తన లైఫ్ లో ఎంత ఇంపార్టెంటో.. ఆ సినిమా నిర్మించిన దిల్ రాజు కూడా అంతే ఇంపార్టెంట్ అని అన్నారు. ఆ టైం లో ఆశిష్, హర్షిత్ వీళ్లంతా చాలా చిన్న పిల్లలని అన్నారు. వీళ్లు ఇప్పుడు సినిమా తీయడం నిజంగా చాలా బాగుందని అన్నారు. ఇక పనిలో పనిగా ఇదే వేదిక మీద నాని నటించిన శ్యాం సింగ రాయ్ సినిమా గురించి బన్నీ కామెంట్స్ చేశారు. అఖండ హిట్ అయ్యింది.. పుష్ప బ్లాక్ బస్టర్ కొట్టింది. ఆ తర్వాత నాని నటించిన శ్యాం సింగ రాయ్ సినిమా కూడా చాలా బాగుందని. ఆ సినిమా తాను చూశానని మీరు కూడా తప్పకుండా చూడాలని. నాని నటన, రాహుల్ డైరక్షన్ చాలా బాగున్నాయని అన్నారు అల్లు అర్జున్. సాయి పల్లవి కూడా బాగా చేసిందని అన్నారు.

తప్పకుండా శ్యాం సింగ రాయ్ చూడండి. ఓటీటీలో అయినా ఈ సినిమా మిస్ అవ్వొద్దని అన్నారు బన్నీ. తాను ఆ సినిమా గురించి మాట్లాడుదామని అనుకున్నా కానీ మర్చిపోయానని. శ్యాం సింగ రాయ్ మస్ట్ వాచ్ మూవీ అని సూపర్ స్పీచ్ ఇచ్చారు బన్నీ. అల్లు అర్జున్ శ్యాం సింగ రాయ్ గురించి మాట్లాడటం ఫ్యాన్స్ కు మంచి కిక్ ఇచ్చింది. సినిమా పరిశ్రమ మేలు కోరే వ్యక్తిగా బన్నీ మరింత మనసులు గెలిచాడని ఈ విషయంతో మరోసారి ప్రూవ్ అయ్యింది.


మరింత సమాచారం తెలుసుకోండి: