దర్శక ధీరుడు రాజమౌళి తన తదుపరి సినిమా మహేష్ బాబుతో చేయబోతున్నాడు అనే విషయం అందరికీ తెలిసిందే. కొన్ని రోజులుగా ప్రెస్ మీట్ లో మహేష్ బాబు తో సహా రాజమౌళి కూడా చెప్పే మాట ఇదే కావడంతో వీరి కలయిక లో సినిమా రావడం గ్యారెంటీ అని అందరూ అనుకున్నారు. కానీ ఇప్పుడు మారిన పరిస్థితులకు అనుగుణంగా జక్కన్న బాలీవుడ్ లో చేసే విధంగా ప్రయత్నాలు చేస్తున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. 

బాహుబలి సినిమా తో దేశవ్యాప్తంగా తన సత్తా చాటుకున్న రాజమౌళి తెలుగు సినిమా స్థాయిని కూడా దేశ వ్యాప్తంగా పెంచాడు అని చెప్పాలి. ఈ సినిమా విడుదల తర్వాత నుంచి తెలుగు సినిమాలను వేరే లెవెల్ లోకి చూడడం మొదలు పెట్టారు ప్రేక్షకులు అందరూ. ఈ నేపథ్యంలో రాజమౌళి తో సహా తెలుగు సినిమా పరిశ్రమలో అగ్ర దర్శకులు దర్శకులంతా కూడా తమ పట్ల ఎంతో జాగ్రత్త వహిస్తూ బాగుందెలా అందరూ మెచ్చుకునేలా చూసుకుని ఇప్పటివరకు సినిమాలు చేసుకుంటూ వచ్చి మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారు.

అయితే రాజమౌళి చేస్తున్న ఆర్ ఆర్ ఆర్ చిత్రం పోస్ట్ పోన్ అయిన తర్వాత ఆయన మనసు మహేష్ తో సినిమా చేయాలనే నిర్ణయాన్ని మార్చుకుని బాలీవుడ్ లో రణబీర్ కపూర్ తో సినిమా చేయాలనే ఆలోచన వచ్చినట్లుగా తెలుస్తుంది. దీనికి కారణం బాలీవుడ్ నుంచి వచ్చిన ప్రెషర్ అని తెలుస్తుంది. వాస్తవానికి బాహుబలి సినిమా చేసిన తర్వాతనే బాలీవుడ్ హీరో తో సినిమా చేయాలని ఒత్తిడి రాజమౌళి పై బాగా ఉంది. కానీ టాలీవుడ్ లో హీరోలతో ముందు సినిమా చేయడానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చిన కారణంగా ఆర్ ఆర్ ఆర్ సినిమా చేశాడు. ఆ తర్వాత బాలీవుడ్ సినిమా చేస్తాడేమో అని ఎదురుచూడగా మహేష్ బాబు తో సినిమా అనగానే అక్కడ కొంత వ్యతిరేకత ఏర్పడింది. ఆ వ్యతిరేకత ఎక్కువైతే బాగుండేదేమో అని రాజమౌళి మహేష్ బాబు తో సినిమా కంటే ముందే ఓ బాలీవుడ్ సినిమా చేయాలని భావించి ఈ నిర్ణయం తీసుకున్నాడట. తొందర్లోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా రానుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: