మెగా కాంపౌండ్ లో నుంచి యువ హీరోగా ఉప్పెన సినిమాతో అడుగుపెట్టాడు హీరో వైష్ణవ తేజ్.. తన మొదటి మూవీతోనే మంచి బ్లాక్ బాస్టర్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నారు. ఇక దీంతో వైష్ణవ్ కు వరుస ఆఫర్లు వెలువడ్డాయి. తాజాగా కొండపొలం సినిమా విడుదల కాగా అంతగా ఆశించిన ఫలితం దక్కలేదు. ప్రస్తుతం డైరెక్టర్ గిరీశయ్య దర్శకత్వంలో తన తదుపరి చిత్రాన్ని చేస్తున్నారు. అయితే దీనికి బాపినీడు నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. ఇక ఇదే బ్యానర్లో అన్నపూర్ణ స్టూడియోస్ తో కలిసి మరొక సినిమా ప్లానింగ్ చేసినట్లుగా సమాచారం. ఇక ఇదే సమయంలో సితార ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్.. డైరెక్టర్ త్రివిక్రమ్ బ్యానర్ తో కలిసి వైష్ణవి తేజ్ మూవీని తాజాగా అనౌన్స్మెంట్ చేయడం జరిగింది.ఈ విషయంలో మాత్రం ఈ యువ హీరోకి, నిర్మాత బాపినీడు మధ్య గొడవ జరిగిందట. వైష్ణవ తేజ్ తన 4 వ మూవీ ని కూడా తన బ్యానర్ పైనే నిర్మించాలని బాపినీడు చాలా గట్టిగా పట్టు పడుతున్నారట. ఈ విషయం మాత్రం అసలు వైష్ణవి తేజ్ కి నచ్చడం లేదట. అయితే నిర్మాత బాపినీడు తో మరొక సినిమా చేస్తానన్న మాట వాస్తవమే.. కానీ అది 4 వదా 5వ దా అని నేను ఎమి చెప్పలేదు.. అంతేకాకుండా నేను ఎక్కడా అగ్రిమెంట్ మీద కూడా సంతకం చేయలేదని తెలియజేశాడు.


ఈ నేపథ్యంలోనే వైష్ణవి  తన మూడవ సినిమాకు సంబంధించి ఒక టైటిల్ అనౌన్స్ మెంట్ కూడా రావడం జరిగింది. అయితే ఈ సినిమా టైటిల్ ను కొన్ని కారణాల వల్ల పోస్ట్ పోన్ చేశామని చిత్రబృందం తెలియజేసింది. ఇక వైష్ణవి తేజమే ఆ నిర్మాత విసిగించడంతో చాలా విసిగిపోయాడు అనే టాక్ బాగా వినిపిస్తోంది. మరి ఈ విషయాన్ని ఎలా ఒప్పందం కుదుర్చుకుంటారో చూడాలి. వైష్ణవి తేజ్ సితార బ్యానర్లో తన తదుపరి చిత్రాన్ని నటించాలని రెడీ అయ్యారట.

మరింత సమాచారం తెలుసుకోండి: