సూపర్ స్టార్ మహేష్ బాబు నుండి సినిమా వచ్చి దాదాపుగా రెండేళ్లకు పైగా అవుతోంది. సరిగ్గా 2020 సంక్రాంతికి అనిల్ రావిపూడి తీసిన సరిలేరు నీకెవ్వరు మూవీ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సూపర్ స్టార్ ఆ సినిమాతో సూపర్ డూపర్ హిట్ కొట్టారు. అనంతరం కోవిడ్ కారణంగా మన దేశంలో కొన్ని నెలల పాటు లాక్ డౌన్ విధించారు. ఆ తరువాత కొన్నాళ్ల అనంతరం తన తదుపరి సినిమా సర్కారు వారి పాట షూట్ మొదలెట్టారు మహేష్ బాబు. అప్పటి నుండి షూటింగ్ జరుగుతున్న ఈ సినిమా నుండి గత ఏడాది మహేష్ బర్త్ డే సందర్భంగా ఫస్ట్ లుక్ టీజర్ రిలీజ్ చేసారు.

ఆ టీజర్ అందరినీ ఆకట్టుకుని సినిమాపై మంచి అంచనాలు క్రియేట్ చేసింది. ఈ సినిమాని ఈ జనవరి లో సంక్రాంతికి రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించిన యూనిట్, ఆ టైములో ఆర్ఆర్ఆర్ మూవీ కోసం విడుదలని ఏప్రిల్ 1కి వాయిదా వేశారు. ఇక ఇటీవల మహేష్ సోదరుడు రమేష్ బాబు మరణంతో మరొక్కసారి సర్కారు వారి పాట షూట్ కి బ్రేకులు పడడంతో మూవీ రిలీజ్ కూడా మరొక్కసారి వాయిదా పడే ఛాన్స్ ఉన్నట్లు ఇన్నర్ వర్గాల టాక్. అయితే అసలు విషయం ఏమిటంటే, పక్కాగా సర్కారు వారి పాట ఏప్రిల్ నుండి విడుదల వాయిదా పడడం పక్కా అని అంటున్నారు.

దానికి కారణం మెగాస్టార్ నటిస్తున్న ఆచార్య సినిమాని ఏప్రిల్ 1కి రిలీజ్ చేస్తున్న ఆ మూవీ యూనిట్ ప్రకటించడంతో తమ హీరో సినిమా అసలు ఏప్రిల్ 1కి వస్తుందో లేదో అనే అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు మహేష్ ఫ్యాన్స్. కాగా ఈ విషయమై పలు టాలీవుడ్ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం వాస్తవానికి ఎప్పుడో షూటింగ్ పూర్తి అయిన ఆచార్య సినిమా కోసం మహేష్ బాబు తన సినిమా విడుదలని మరొక్కసారి వాయిదా వేశారని, అందుకే ఆచార్య యూనిట్ అదే తేదీన తమ సినిమా రిలీజ్ ని ప్రకటించిందని సమాచారం. మరి ఈ వార్త కనుక నిజం అయితే అప్పుడు ఆర్ఆర్ఆర్ కోసం తన సర్కారు వారి పాట వాయిదా వేసి త్యాగం చేసిన మహేష్, ఇప్పుడు మెగాస్టార్ కోసం కూడా మరొక్కసారి త్యాగం చేసినట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: