కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించిన సర్కారు వారి పాట మూవీని యువ దర్శకుడు పరశురామ్ పెట్ల దర్శకత్వంలో తీయగా 14 రీల్స్ ప్లస్, జిఎంబి ఎంటర్టైన్మెంట్స్, మైత్రి మూవీ మేకర్ వారు నిర్మించారు. అయితే ప్రీమియర్స్ నుండి అక్కడక్కడా ఒకింత మిశ్రమ స్పందన అందుకున్న సర్కారు వారి పాట మూవీ, ఆ తరువాత అన్ని వర్గాల ఆడియన్స్ నుండి మంచి టాక్ సంపాదించుకుని ప్రస్తుతం బాగా కలెక్షన్స్ తో దూసుకెళుతోంది. ఇప్పటికే రిలీజ్ అయిన మూడు రోజుల్లో అత్యధిక స్థాయిలో గొప్ప రికార్డ్స్ కొల్లగొట్టిన సర్కారు వారి పాట మూవీ, రేపు నాలుగవ రోజు కూడా మరింతగా రాబట్టే ఛాన్స్ ఉందని అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు.
నిజానికి మహేష్ బాబు సినిమాకి యూత్, మాస్ తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ కూడా ఎంతో కనెక్ట్ అవుతారు, ఇక సర్కారు వారి పాట ఎంటర్టైన్మెంట్ తో పాటు భారీ యాక్షన్, కమర్షియల్ హంగులతో తెరకెక్కడంతో బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్స్ ఊచకోత కోస్తున్నారు మహేష్. మరోవైపు ఎల్లుండి సోమవారం నుండి ఈ మూవీకి అసలైన పరీక్ష ఉంటుందని, అయితే ప్రస్తుతం నడుస్తున్న టాక్ ని బట్టి చూస్తుంటే అప్పటి నుండి సర్కారు వారి పాత బాగానే ముందుకు కొనసాగే అవకాశం కనపడుతోందని అంటున్నారు ట్రేడ్ పండితులు.