హీరో సాయిధరమ్ తేజ్ కి యాక్సిడెంట్ అయిన సంగతి మనందరికీ తెలిసిందే. అయితే సాయిధరమ్ తేజ్ తాజాగా ఇప్పుడు యాక్సిడెంట్ అయిన తర్వాత చాలా గ్యాప్ తీసుకొని  మళ్ళీ ప్రేక్షకులని పలకరించనున్నాడు.ఇకపోతే తేజ్ యాక్సిడెంట్ వల్ల దాదాపు ఆరునెలలు రెస్ట్ తీసుకోవాల్సి వచ్చింది.అయితే ప్రస్తుతం పూర్తిగా కోలుకున్న సాయిధరమ్ తేజ్ షూటింగ్ సెట్స్ లోకి అడుగుపెట్టడం జరిగింది.ఇకపోతే తాజాగా సాయిధరమ్ తేజ్ 15వ సినిమాని కార్తీక్‌ దండు దర్శకత్వంలో బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌, సుకుమార్‌ నిర్మాతలుగా తెరకెక్కిస్తున్నారు. ఇక ప్రస్తుతం ఇప్పుడు షూటింగ్ శరవేగంగా సాగుతోంది. అయితే ఇప్పటికే 25 రోజుల్లో 30 శాతం షూటింగ్ పూర్తయినట్టు సమాచారం. 

అంతేకాదు తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ని రిలీజ్ చేశారు. కాగా ఈ పోస్టర్ చాలా ఆసక్తిగా ఉంది.ఇదిలావుండగా మరోవైపు టాలీవుడ్ వర్గాల నుంచి వచ్చిన సమాచారం ప్రకారం సాయిధరమ్ తేజ్ కంబ్యాక్ సినిమా స్టోరీ ఇదే అని తెలుస్తుంది.అయితే ఈ సినిమాలో  ఓ ఊళ్లో వరుసగా కొంతమంది చనిపోతుండటంతో దానికి కారణం ఏంటి అని తెలుసుకోవాలని వెళ్లిన యువకుడికి ఎలాంటి అనుభవాలు ఎదురవుతాయి?ఇక  ఆ చావుల వెనక రహస్యం ఏమిటి?,అంతేకాదు  బ్లాక్‌ మేజిక్‌, మిస్టరీ థ్రిల్లర్ అంశాలతో సినిమా తెరకెక్కనున్నట్లు తెలుస్తోంది. ఇదిలావుంటే సాయిధరమ్ తేజ్ కెరీర్ లో ఇలాంటి కథ మొదటి సారి చేయడం. ఇక దీంతో ఈ సినిమా కచ్చితంగా హిట్ అవుతుందని భావిస్తున్నారు.

 అయితే ఇక సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్ తెర మీద ఎప్పుడు కనిపిస్తాడా అని మెగా ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.ఇక ఈ సినిమా అనంతరం సాయి ధరంతేజ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో కలిసి ఓ మల్టీస్టారర్ సినిమాలో నటించబోతున్నాడు. ఇటీవల తమిళంలో మంచి విజయాన్ని అందుకున్న వినోదయ సీతమ్ సినిమాని తెలుగులో రీమేక్ చేస్తున్నారు. ఇది రిమేక్లో పవన్ కళ్యాణ్ సాయి ధరమ్ తేజ్ కలిసి నటిస్తున్నారు. తమిళ్ డైరెక్టర్ సముద్రకని ఈ రీమేక్ కి దర్శకత్వం వహిస్తున్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్రీమేక్ కి స్క్రీన్ ప్లే డైలాగ్స్ అందిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి...!!

మరింత సమాచారం తెలుసుకోండి: