అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్‌లో వచ్చిన సినిమా పుష్ప.. రష్మిక మందన్న హీరోయిన్ గా ఆ సినిమాలో నటించింది..అల్లు అర్జున్ కెరియర్ లో ఎప్పుడూ లేని విధంగా కంప్లీట్ మాస్ యాక్షన్ కోణంలో ఈ సినిమాను రూపొందించారు..మొదట సినిమాకు మంచి టాక్ అందక పోయిన తర్వాత మంచి హిట్ టాక్ ను అందుకుంది. బాక్సాఫీస్ దగ్గర భారీగానే వసూళ్లు రాబట్టింది. ఇప్పటి వరకూ కూడా పుష్ప రెండు పార్ట్‌ల గురించే సుకుమార్ మాట్లాడుతూ వచ్చాడు. అయితే ఈ చిత్రానికి మూడో భాగం కూడా ఉన్నట్లు కొద్ది రోజుల క్రితం విజయ్ దేవరకొండ సోషల్ మీడియా ద్వారా పోస్ట్ చేశారు.


హ్యాపి బర్త్‌డే సుకుమార్ సర్. మీరు ఆరోగ్యంగా, సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నా.మీతో సినిమా ప్రారంభించే రోజు కోసం వెయిట్ చేయలేకపోతున్నా' అంటూ పోస్ట్ లో పేర్కొన్నారు.ఆ కిందే '2021-ది రైజ్, 2022-ది రూల్, 2023-ది ర్యాంపేజ్' అంటూ బాంబు పేల్చాడు. దీంతో పుష్ప సిరీస్‌లో మూడో చిత్రం కూడా ఉందని ప్రచారం జోరందుకుంది. కాగా, సుకుమార్ కెరీర్‌లో ప్రత్యేకంగా నిలిచిన ఆర్య, ఆర్య-2 చిత్రాల క్రమంలోనే ఆర్య-3 కోసం ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇటీవల కేజీయఫ్ చాప్టర్-2లో కేజీయఫ్3కు హింట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఇలాంటి లీడ్‌నే పుష్ప2 లోనూ ఇచ్చేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తుందట. అంటే.. పుష్పరాజ్ తన సత్తాను పుష్ప2తో మాత్రమే ఆపడు..



సినిమా సక్సెస్ టాక్ ను బట్టి సీక్వెల్ 3 ను కూడా దర్శకుడు ప్లాను చేస్తున్నాడు.పుష్ప సినిమాలో బన్నీ సరసన అందాల భామ రష్మిక మందన హీరోయిన్‌గా నటిస్తుండగా, భారీ క్యాస్టింగ్ ఈ సినిమాలో నటించబోతుంది. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ ఇస్తున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేయనున్నారు. ఈ సినిమాను దర్శకుడు సుకుమార్ తెరకెక్కించిన విధానం ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకోవడంతో, ఈ సినిమాకు సీక్వెల్‌గా పుష్ప 2 చిత్రాన్ని కూడా అనౌన్స్ చేసింది చిత్ర యూనిట్. ఈ సినిమాను అతి త్వరలో పట్టాలెక్కించేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతుండటంతో, పుష్ప2 సినిమాకు సంబంధించి సోషల్ మీడియాలో రోజుకో వార్త చక్కర్లు కోడుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: