కరోనా వైరస్ లాక్ డౌన్ కారణంగా ఆర్థిక పరిస్ధితి అనేది పూర్తిగా దిగజారిపోయింది. అన్ని రంగాలు కూడా తీవ్ర ఆర్థిక ఇబ్బందులో కూరుకుపోయాయి. అన్ని పరిశ్రమలు కూడా ఆర్థిక ఇబ్బందుల వల్ల ఉద్యోగులను కూడా తొలగించాయి.అయితే ఇక ఇప్పుడిప్పుడు కరోనా ప్రభావం తగ్గుతుండటంతో కంపెనీలు ఇంకా అలాగే వివిధ రకాల పరిశ్రమలు మళ్లీ తమ వ్యాపార కార్యకలాపాలను తిరిగి ప్రారంభిస్తున్నాయి. దీంతో ఆర్థిక పరిస్ధితులు మెల్లగా మళ్లీ కుదుట పడుతున్నాయి. ఇంకా అలాగే సినిమా రంగం కూడా లాక్ డౌన్ కారణంగా చాలా తీవ్ర ఇబ్బందులు పడింది. అయితే లాక్ డౌన్ తర్వాత మళ్ళీ కొంచెం కొంచెంగా కొలుకుంటోంది.తాజాగా 2022 వ సంవత్సరంలో ఇప్పటివరకు కూడా ఇండియాలో విడుదలైన సినిమాల్లో అత్యధిక కలెక్షన్లు సాధించిన టాప్ 1 సినిమా పేర్లను ట్రేడ్ వర్గాలు బయటపెట్టాయి. అందులో కన్నడ స్టార్ హీరో హీరో యశ్ హీరోగా ఇంకా ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన పాన్ ఇండియా సినిమా కేజీఎఫ్2 అగ్ర స్థానంలో కొనసాగుతోంది. ఇక నెంబర్ 2 స్థానంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇంకా మెగా పవర్ స్టార్ రాంచరణ్ హీరోలుగా దిగ్గజ దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమా ఉంది.


ఇక మూడో స్థానంలో తమిళ సీనియర్ హీరో కమల్ హాసన్ నటించిన విక్రమ్, ఇంకా నాలుగో స్థానంలో కశ్మీర్ ఫైల్స్, అలాగే ఐదో స్థానంలో భూల్ భులయ్యా 2 సినిమాలు వున్నాయి. 6 వ స్థానంలో అజిత్ పాన్ ఇండియా సినిమా వలిమై సినిమా ఉండగా 7వ స్థానంలో సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన సర్కారు వారి పాట సినిమా వుంది. 8 వ స్థానంలో సూర్య ET ఉండగా 9వ స్థానంలో బీస్ట్ సినిమా వుంది.ఇక పవన్ కల్యాణ్ హీరోగా వచ్చిన భీమ్లా నాయక్ సినిమా పదో స్థానంలో వుంది. ఈ సంవత్సరం టాప్ 10లో రెతెలుగు సినిమాలు మూడు ఉన్నాయి. ఆర్ఆర్ఆర్ రూ.1130 కోట్ల గ్రాస్ వసూల్ చేయగా సర్కారు వారి పాట రూ.210 కోట్ల గ్రాస్ చేసింది. భీమ్లా నాయక్ సినిమా రూ.132.90 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. అయితే సూపర్ స్టార్ మహేష్ సర్కారువారి పాట సినిమాకు మిక్స్ డ్ టాక్ వచ్చినా.. కలెక్షన్ల పరంగా ఈ రేంజ్ లో భారీగా రాబట్టడం చాలా గ్రేట్ అని ట్రేడ్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: