తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి టాలెంట్ ఉన్న దర్శకుడిగా పేరు తెచ్చుకున్న వేణు శ్రీరామ్ గురించి కొత్తగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. వేణు శ్రీరామ్ , సిద్ధార్థ్ హీరోగా తెరకెక్కిన ఓ మై ఫ్రెండ్ మూవీ తో దర్శకుడుగా తన కెరియర్ ను మొదలు పెట్టాడు. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర పర్వాలేదు అనే రేంజ్ విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత ఈ దర్శకుడు నాచురల్ స్టార్ నాని హీరోగా సాయి పల్లవి హీరోయిన్ గా తెరకెక్కిన ఎం సీ ఏ మూవీ కి దర్శకత్వం వహించాడు.

మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత కొంత కాలం గ్యాప్ తీసుకున్న ఈ దర్శకుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా శృతి హాసన్ హీరోయిన్ గా తెరకెక్కిన వకీల్ సాబ్ మూవీ కి దర్శకత్వం వహించాడు. ఈ మూవీ కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం సాధించింది. వకీల్ సాబ్ మూవీ విడుదల అయ్యి ఇప్పటికే చాలా కాలం అవుతున్న ఈ దర్శకుడు తన తదుపరి మూవీ కి సంబంధించిన ఎలాంటి అప్డేట్ ని ఇప్పటి వరకు ప్రకటించలేదు.

ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఈ దర్శకుడి తదుపరి మూవీ కి సంబంధించిన ఒక క్రేజీ న్యూస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. అసలు విషయం లోకి వెళితే ... తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ ఉన్న ప్రొడక్షన్ హౌస్ లలో ఒకటి అయినటువంటి యూ వి క్రియేషన్స్ బ్యానర్ లో వేణు శ్రీరామ్ తన తదుపరి మూవీ ని చేయనున్నట్లు , అలాగే ఈ మూవీ లో ఒక స్టార్ హీరో నటించే అవకాశం ఉన్నట్లు ఒక వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఈ వార్త ఎంత వరకు నిజమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: