బాలీవుడ్ ఇండస్ట్రీ లో అదిరి పోయే క్రేజ్ ఉన్న యువ హీరోలలో ఒకరు ఆయన రన్బీర్ కపూర్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. రన్బీర్ కపూర్ తాజాగా షంషేరా మూవీ తో ప్రేక్షకులను పలకరించాడు. ఈ మూవీ హిందీ తో పాటు తెలుగు లో కూడా విడుదల అయ్యింది. భారీ అంచనాల నడుమ విడుదల అయిన షంషేరా మూవీ ప్రేక్షకులను బాక్సా ఫీస్ దగ్గర తీవ్ర నిరుత్సాహపరిచింది.

ఇలా షంషేరా మూవీ తో బాక్సా ఫీస్ దగ్గర ప్రేక్షకులను నిరుత్సాహపరిచిన రన్బీర్ కపూర్ తాజాగా బ్రహ్మాస్త్రం అనే మూవీ లో హీరోగా నటించాడు. ఈ మూవీ భారీ బడ్జెట్ 2 D మరియు 3 D వర్షన్ లలో రూపొందింది. ఈ మూవీ కి అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించగా ,  ఈ మూవీ లో ఆలియా భట్ , రన్బీర్ కపూర్ సరసన హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ నిన్న అనగా సెప్టెంబర్ 9 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున థియేటర్ లలో విడుదల అయ్యింది.

మూవీ విడుదల ముందు చిత్ర బృందం ఈ మూవీ నుండి విడుదల చేసిన ప్రచార చిత్రాలు అద్భుతంగా ఉండడం ,  ఎస్ ఎస్ రాజమౌళిమూవీ ని తెలుగు లో సమర్పించడం తో ఈ మూవీ పై తెలుగు సినీ ప్రేమికులు కూడా భారీ అంచనాలు పెట్టుకున్నారు. దానితో ఈ మూవీ కి మొదటి రోజు బ్రహ్మాస్త్రం మూవీ కి రెండు తెలుగు రాష్ట్రాల్లో అదిరి పోయే రేంజ్ కలెక్షన్ లు బాక్స్ ఆఫీస్ దగ్గర లభించాయి. ఈ మూవీ మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 6.2 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది. ఇలా బ్రహ్మాస్త్రం మూవీ కి మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో అదిరిపోయే రేంజ్ ఓపెనింగ్ లు లభించాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: