నయనతార మాత్రం తన పద్ధతిని మార్చుకోను అంటూ తెగేసి చెప్పింది కూడా .. గతంలో ప్రెస్ మీట్ కానీ ఈవెంట్ కి కానీ హాజరు అవ్వడానికి ఇష్టపడని నయనతార ఇప్పుడు తన పద్ధతిని మార్చుకున్నట్లు తెలుస్తోంది. పెళ్లి తర్వాత ఆమె చాలా విషయాలలో ఎన్నో మార్చుకున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే అదే సమయంలో ఆమె తీసుకపోతున్న రెమ్యూనరేషన్ లో కూడా వార్తలు వైరల్ అవుతున్నాయి. గతంలో రూ.4 కోట్ల పారితోషకం తీసుకున్న నయనతార ఇప్పుడేకంగా రూ.8 కోట్లకు పెంచేసింది. ఇదే సమయంలో భారీ పారితోషకం ఇస్తే ఇకనుండి తాను నటించిన సినిమాల యొక్క పబ్లిసిటీ కార్యక్రమంలో కూడా పాల్గొంటాను అంటూ నిర్మాతలకు బంపర్ ఆఫర్ ప్రకటించింది.
నయనతార తీసుకున్న ఈ కొత్త నిర్ణయంతో నిర్మాతలు చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక భారీగా పారితోషకం పెంచడం అనేది వారికి కాస్త ఇబ్బందిని కలిగించినా ప్రమోషన్స్ కి వస్తుందనే ఆనందం వారిలో ఎక్కువవుతుంది. తమిళంలోనే కాదు తెలుగులో కూడా ఈమె నటిస్తోంది. ఇకపోతే భారీ పారితోషకం ఎవరు ముందుగా ఇస్తారో అనే విషయం తెలియాల్సి ఉంది.