సినిమా ఇండస్ట్రీ లోకి ప్రతి సంవత్సరం ఎంతో మంది ముద్దుగుమ్మలు ఎంట్రీ వస్తూ ఉంటారు. కానీ వారిలో కొంత మంది కి మాత్రమే నటించిన మొదటి మూవీ తోనే అద్భుతమైన క్రేజ్ , అలాగే అద్భుతమైన విజయం దక్కుతూ ఉంటాయి. అలాంటి వారిలో కృతి శెట్టి ఒకరు. ఈ ముద్దుగుమ్మ ఉప్పెన మూవీతో తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీతో అద్భుతమైన విజయాన్ని , అంతకు మించిన క్రేజ్ ని తెలుగు సినిమా ఇండస్ట్రీ లో దక్కించుకుంది. ఆ తర్వాత కూడా ఈ ముద్దుగుమ్మకు అద్భుతమైన సినిమాలలో అవకాశాలు వచ్చాయి.

అందులో భాగంగా ఈ ముద్దుగుమ్మ నటించిన సినిమాల కూడా వరుస విజయాలను బాక్సాఫీస్ దగ్గర అందుకున్నాయి. ఇలా వరుస విజయాలను బాక్సాఫీస్ దగ్గర అందుకుంటూ వరస క్రేజీ సినిమా అవకాశాలను దక్కించుకుంటూ ముందుకు దూసుకుపోతున్న ఈ ముద్దుగుమ్మ ఆఖరుగా నటించిన రెండు సినిమాలు మాత్రం బాక్సాఫీస్ దగ్గర ఫ్లాప్ గా నిలిచాయి. కృతి శెట్టి , రామ్ పోతినేని సరసన ది వారియర్ మూవీ లో హీరోయిన్ గా నటించింది. భారీ అంచనాల నడుమ విడుదల అయిన ది వారియర్ మూవీ బాక్సా ఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. అలాగే కృతి శెట్టి తాజాగా నితిన్ హీరోగా తెరకెక్కిన మాచర్ల నియోజకవర్గం అనే మూవీ లో హీరోయిన్ గా నటించింది.

మూవీ కూడా బాక్సా ఫీస్ దగ్గర ప్రేక్షకుల అంచనాలను ఏ మాత్రం అందుకోలేక ఫ్లాప్ గా మిగిలింది. ఇది ఇలా ఉంటే తాజాగా సుధీర్ బాబు హీరోగా ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి మూవీ లో కృతి శెట్టి హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ మరి కొన్ని రోజుల్లో విడుదల కాబోతుంది. మరి ఈ మూవీ తో అయిన కృతి శెట్టి హిట్ కొట్టి మళ్ళీ ఫామ్ లోకి వస్తుందో ... లేదో ... చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: