కోలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ హీరో లలో ఒకరిగా ఓ వెలుగు వెలుగుతున్న తలపతి విజయ్ ప్రస్తుతం టాలీవుడ్ క్రేజీ దర్శకుడు అయినటు వంటి వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ లో హీరోగా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ తమిళం లో తెరకెక్కుతూ ఉండగా ఈ మూవీ ని తెలుగు లో డబ్ చేసి విడుదల చేయనున్నారు. తమిళం లో ఈ మూవీ వరసు పేరుతో తెరకెక్కుతూ ఉండగా ,  తెలుగు లో ఈ మూవీ వారసుడు పేరుతో తెరకెక్కుతుంది.

మూవీ ని ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తూ ఉండగా , నేషనల్ క్రష్ రష్మిక మందన ఈ మూవీ లో తలపతి విజయ్ సరసన హీరోయిన్ గా నటిస్తుంది. సన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ ఎస్ తమన్మూవీ కి సంగీతాన్ని అందిస్తున్నాడు. ఇది ఇలా ఉంటే ఈ మూవీ తర్వాత తలపతి విజయ్ , లోకేష్ కనకరాజు దర్శకత్వంలో తెరకెక్కబోయే మూవీ లో నటించబోతున్నాడు. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్ లో తేరకెక్కిన మాస్టర్ మూవీ మంచి విజయం సాధించడంతో వీరిద్దరి కాంబినేషన్ లో తెరకెక్కబోయే తదుపరి మూవీ పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నేలలు ఉన్నాయి.

ప్రస్తుతం లోకేష్ కనకరాజు ఈ మూవీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నట్టు తెలుస్తుంది. అందులో భాగంగా ఈ మూవీ లో ఒక కీలకమైన పాత్ర కోసం సంజయ్ దత్ తీసుకోవాలనే ఆలోచనలో లోకేష్ కనకరాజు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ మూవీ లో నటించడానికి సంజయ్ దత్ 10 కోట్ల వరకు రెమ్యూనిరేషన్ ని డిమాండ్ చేస్తున్నట్లు ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇది ఇలా ఉంటే సంజయ్ దత్ తాజాగా కే జీ ఎఫ్ చాప్టర్ 2 మరియు షంషేరా మూవీ లలో ప్రతి నాయకుడి పాత్రలలో నటించి మెప్పించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: