మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇది ఇలా ఉంటే మెగాస్టార్ చిరంజీవి ఈ సంవత్సరంలో ఇప్పటికే రెండు మూవీ లతో ప్రేక్షకులను పలకరించాడు. చిరంజీవి మొదట ఈ సంవత్సరం ఆచార్య మూవీ తో ప్రేక్షకులను పలకరించాడు. భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఆచార్య మూవీ ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేక పోయింది. ఆచార్య మూవీ కి కొరటాల శివ దర్శకత్వం వహించగా , మెగా పవర్ స్టార్ రామ్ చరణ్మూవీ లో ఒక కీలక పాత్రలో నటించాడు. ఈ మూవీ లో చిరంజీవి , రామ్ చరణ్ లు నక్సలైట్ పాత్రలలో నటించారు. ఈ మూవీ లో రామ్ చరణ్ సరసన పూజ హెగ్డే హీరోయిన్ గా నటించింది.

ఇది ఇలా ఉంటే ఆచార్య మూవీ తో ప్రేక్షకులను నిరుత్సాహ పరిచిన మెగాస్టార్ చిరంజీవి తాజాగా గాడ్ ఫాదర్ మూవీ తో ఈ సంవత్సరం మరో సారి ప్రేక్షకులను పలకరించాడు. ఈ మూవీ కి మోహన్ రాజా దర్శకత్వం వహించాడు. ఈ మూవీ లో సల్మాన్ ఖాన్ , సత్య దేవ్ , నయన తార ఇతర ముఖ్య పాత్రలలో నటించగా , ఈ మూవీ కి  ఎస్ ఎస్ తమన్ సంగీతాన్ని అందించాడు. ఈ మూవీ ని అక్టోబర్ 5 వ తేదీన తెలుగు మరియు హిందీ భాషలలో భారీ ఎత్తున విడుదల చేశారు. ఈ మూవీ కి విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే బ్లాక్ బస్టర్ టాక్ రావడంతో ప్రస్తుతం ఈ మూవీ కి అద్భుతమైన కలెక్షన్ లు బాక్స్ ఆఫీస్ దగ్గర దక్కుతున్నాయి. ఇది ఇలా ఉంటే ఈ మూవీ కి హిందీ భాష నుండి కూడా అద్భుతమైన రెస్పాన్స్ లభిస్తుంది. దానితో ఈ రోజు నుండి గాడ్ ఫాదర్ మూవీ  హిందీ వర్షన్ కి 600 స్క్రీన్ లను ఆడ్ చేస్తున్నారు  దీనితో గాడ్ ఫాదర్ మూవీ కలెక్షన్ లు హిందీ లో మరింత పెరిగే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: