వకీల్ సాబ్ మరియు భీమ్లా నాయక్ వంటి సూపర్ హిట్ సినిమాల తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న భారీ బడ్జెట్ పాన్ ఇండియన్ పీరియడ్ చిత్రం 'హరిహర వీరమల్లు'..సుమారు 200 కోట్ల రూపాయిల భారీ బడ్జెట్ తో..అత్యునత సంకేత నిపుణులు మరియు భారీ తారాగణం తో నిర్మాత AM రత్నం కనివిని ఎరుగని రీతిలో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నాడట...ఇప్పటికే 50 శాతం కి పైగా షూటింగ్ ని పూర్తి చేసుకున్న ఈ చిత్రం, ఇటీవలే రామోజీ ఫిలిం సిటీ లో వేసిన భారీ సెట్స్ లో లేటెస్ట్ షెడ్యూల్ ని ప్రారంబించుకుందని తెలుస్తుంది.

ఇది స్వయంగా ఆ చిత్ర దర్శకుడు క్రిష్ గారే తన సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా తెలిపాడు..ఈ సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న సంగతి మన అందరికి తెలిసిందే..జనవరి నెలలోపు ఎట్టి పరిస్థితిలో సినిమా షూటింగ్ ని పూర్తి చేసి వచ్చే సమ్మర్ కానుకగా ప్రేక్షకుల ముందుకి ఈ చిత్రాన్ని తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారని తెలుస్తుంది..

నైజాం నవాబు కాలం నాటి కథ కావడం తో ఈ చిత్రం లో పాత్రలు కొన్ని నిజజీవితం లో ఉండేవి ఉంటాయి..అందులో ఔరంగజేబు పాత్ర కూడా ఒకటి..తొలుత ఈ పాత్ర కోసం అర్జున్ రాంపాల్ ని తీసుకున్నారట..కానీ షూటింగ్ ఆలస్యం అవుతూ రావడం తో అతని డేట్స్ సర్దుబాటు చెయ్యడం కష్టం అయిపోయింది..ఇప్పుడు అతని స్థానం లో బాలీవుడ్ హీరో 'బాబీ డియోల్' ని తీసుకున్నట్టు సమాచారం..ఈ షెడ్యూల్ లోనే ఆయన పాత్ర కి సంబంధించిన చిత్రీకరణ కూడా జరగబోతుంది అని తెలుస్తుంది..ఇక ఇటీవలే విడుదల చేసిన గ్లిమ్స్ వీడియో కి కూడా అభిమానులు మరియు ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ కూడా వచ్చింది.

 


ఇక న్యూ ఇయర్ రోజు ఈ సినిమాకి సంబంధించిన టీజర్ ని విడుదల చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నారట..న్యూ రోజు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరో గా నటించిన ఖుషి సినిమా స్పెషల్ షోస్ ని ప్రపంచవ్యాప్తంగా ప్లాన్ చేస్తున్న సంగతి మన అందరికి తెలిసిందే..ఆ స్పెషల్ షోస్ లోనే హరి హర వీరమల్లు టీజర్ ని కూడా అటాచ్ చేసి దింపుతారని సమాచారం

మరింత సమాచారం తెలుసుకోండి: