వ్యవసాయం అంటే ప్రస్తుతం ఉన్న కాలంలో చాలా భారంగా మారుతోంది.ఇప్పటికి చాలామంది రైతులు నష్టపోతున్నారు కూడా.. ముఖ్యంగా అప్పుల ఊబిలో చిక్కుకొని చాలామంది ఇబ్బందులు పడుతున్న వారు కూడా ఉన్నాయి.. అయితే కొంతమంది యువ రైతులు మాత్రం సాంప్రదాయమైన వ్యవసాయాన్ని వదిలి ఆధునిక పద్ధతులలో పంటలను పండిస్తూ భారీగానే లాభాలను పొందుతూ ఉన్నారు. అయితే తాజాగా గుజరాత్లో అహ్మదాబాద్ లో ఒక రైతు కేవలం రెండు నెలలలోనే రూ.3 లక్షలకు పైగా సంపాదించి మోడల్ గా నిలిచారు. అది ఎలాగో ఇప్పుడు ఒకసారి చూద్దాం.

చాలామంది రైతులు వ్యవసాయాన్ని వదిలిపెట్టి పట్టణాలకు వెళ్లి ఏదో ఒక చిన్న పనులను చేసుకుంటున్నారు. మరి కొంత మంది వ్యవసాయం చేస్తున్న పెద్దగా లాభాలు లేవని ఏదైనా పంట పండించాలంటే అందుకు తగ్గ అనుభవం కూడా ఉండాలి.. అయితే కొంతమంది యువ రైతులు సీజన్ కి తగ్గట్టుగా పంటలను పండిస్తూ భారీగానే లాభాలను అందుకుంటున్నారు. రాయ్ బరేలీ జిల్లాకు చెందిన విజయకుమార్ అనే వ్యక్తి తమ పూర్వీకుల పొలంలో వ్యవసాయాన్ని చేసేవారు.. కానీ అతను బంధువులలో ఒకరు హార్టికల్చర్ కోర్స్ తీసుకున్నారట.


అలా పవన్ వర్మ ఒక కార్యక్రమంలో అక్కడికి వచ్చినప్పుడు తనకు పుచ్చకాయల పండించమని సూచించారట. ఆయన సలహా మేరకు ఆ పంటను వేశారు విజయకుమార్.. ఈ సాగులో తక్కువ ఖర్చుతో అధిక లాభం ఉండడంతో ఇతర పంటల పోలిస్తే మంచి లాభాదాయకంగా ఉన్నదట. ముఖ్యంగా వేసవికాలంలో వీటికి మంచి గిరాకీ ఉండడం వల్ల అధిక ధరకే అమ్ముడుపోయినట్లు తెలుస్తోంది. కేవలం ఎకరా పొలంలో రూ .50 నుంచి 60 వేల రూపాయల ఖర్చు చేశారట.. అలా ఖర్చులు మొత్తం తీసేసి దాదాపుగా తనకి రూ.2.5 లక్షల రూపాయలు లాభం వచ్చిందని తెలియజేశారు మిగతా పంటల కంటే ఈ పంట మంచి లాభాలను ఇచ్చిందని విజయ్ వెల్లడించారు. తన పుచ్చకాయలను లక్నో మార్కెట్లో పంపుతూ మంచి లాభాలను అందుకున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: