సంజయ్దత్ జీవితాధారంగా రాజ్కుమార్ హిరాణీ దర్శకత్వంలో రణబీర్ హీరోగా ‘సంజు’ బయోపిక్ తెరకెక్కిన విషయం తెలిసిందే. ఈ సినిమా బాక్సాఫీస్ దుమ్ము రేపి ఎన్నో సినిమాల రికార్డులను బద్దలు కొట్టింది. సంజు సినిమాలో లో వాస్తవాలని పక్కన పెట్టి సంజయ్ దత్ ని మంచోడిగా చూపించే ప్రయత్నం చేశారనే ఆరోపణ ఉన్న సంగతి తెలిసిందే. '
రాజ్ కుమార్ హిరానీ తెరకెక్కించిన సంజు సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద దూసుకెళుతోంది. ఇప్పటికే 300 కోట్లకు వసూళ్లుతో ప్రభంజనం సృష్టిస్తోంది. ఆడియన్స్ ఎమోషనల్ గా ఈ చిత్రంతో కనెక్ట్ అయ్యారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రస్టింగ్ న్యూస్ ట్రోల్ అవుతోంది. వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ సంజయ్దత్ బయోపిక్ను తెరకెక్కించనున్నట్టు తెలుస్తోంది.
సంజయ్ దత్ నిజమైన బయోపిక్ను తెరకెక్కిస్తానని ఆర్జీవీ తెలిపారు. రాజ్కుమార్ హిరాణీ సంజు నచ్చిందని కానీ రెండు దశాబ్దాలుగా సంజయ్ను ఎదుర్కొంటున్న ఓ సమస్యను ప్రధానాంశంగా సినిమాను తెరకెక్కిస్తానని పేర్కొన్నారు. పరోక్షంగా ముంబై పేలుళ్ల కేసును ప్రస్తావించారు. దీనికి సంబంధించి ఓ హింట్ కూడా ఇచ్చారు వర్మ.
సంజయ్ దగ్గరకు ఏకే-56 రైఫిల్ ఎలా వచ్చింది.. దానికి దారి తీసిన పరిస్థితుల గురించి చర్చిస్తానన్నారు. డ్రగ్స్ కేసు, ముంబై పేలుళ్లు ఇలా అనేక వివాదాలు సంజయ్ దత్ జీవితంలో చోటుచేసుకున్నాయి. కాగా, వర్మ తెరకెక్కించబోయే సంజయ్ దత్ బయోపిక్ టైటిల్ సంజు ది రియల్ స్టోరీ అనే ప్రచారం జరుగుతోంది.