టాలీవుడ్ లో ఒకప్పుడు యాంగ్రీ యంగ్ మాన్ గా పేరు తెచ్చుకున్న హీరో డాక్టర్ రాజశేఖర్.  మొదట విలన్ గా కెరీర్ ప్రారంభించిన ఆయన తర్వాత కొన్ని యాక్షన్ సినిమాలతో మంచి పేరు తెచ్చుకున్నారు.  అల్లరి ప్రియుడు సినిమా తర్వాత పూర్తిగా ఫ్యామిలీ తరహా సినిమాల్లో నటిస్తూ వచ్చారు.  తన సహనటి అయిన జీవితను వివాహం చేసుకున్నారు రాజశేఖర్. వీరికి ఇద్దరు పిల్లలు.  ప్రస్తుతం వారసుల హవా కొనసాగుతున్న నేపథ్యంలో ఈ మద్య వారసురాళ్లు కూడా వెండి తెరకు పరిచయం అవుతున్నారు. 


బాలీవుడ్ లో ఈ సాంప్రదాయం ఎప్పటి నుంచో కొనసాగుతుంది.  టాలీవుడ్ లో మెగాబ్రదర్ నాగబాబు తనయ కొణిదెల నిహారిక హీరోయిన్ గా నటిస్తున్నారు.  ఇక జీవితా రాజశేఖర్ ల కుమార్తె శివానీ రాజశేఖర్ హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వాలనుకుంది.  ఆమె కోసం ఎన్నో కథలు అనుకున్నారు..చిరవగా అడివి శేష్ హీరోగా 'టూ స్టేట్స్' రీమేక్ లో నటించడానికి నిర్ణయించుకున్నారు. ఈ సినిమా ఇప్పుడు మద్యలోనే బ్రెక్ పడినట్లు ఫిలిమ్ వర్గాల టాక్.

సినిమా నిర్మాణం సగం పూర్తయిన తరువాత దర్శకుడి పనితనం నచ్చక ప్రాజెక్ట్ ని మధ్యలోనే  ఆపేసినట్లు సమాచారం. దీంతో అడివి శేష్ మరో సినిమా సెట్స్ పైకి వెళ్లిపోయారు. కాగా, 'టూ స్టేట్స్'  రిమేక్ ఆసక్తిగా మొదలుపెట్టిన నిర్మాత సత్యనారాయణకి దర్శకుడు వెంకట్ కనీసం ఔట్ పుట్ రాబట్టలేకపోయాడట.దీంతో ప్రాజెక్ట్ ఆపేయాలని నిర్ణయించుకున్నారు. అయితే ఈ విషయంపై అఫిషియల్ గా ప్రకటన మాత్రం రాలేదు. 



మరింత సమాచారం తెలుసుకోండి: