రష్మిక మందన టాలీవుడ్లో మెరుపు తీగలా దూసుకు వచ్చి గీతా గోవిందాన్ని చెప్పేసింది. చలో అన్న ఈ అమ్మడు వెనకలా పోలోమంటూ కుర్రకారు పరుగులు తీశారు. వరసగా మూవీస్ చేసుకుంటూ పోతున్న రష్మిక టాప్ స్టార్ గా కొద్ది కాలంలోనే గుర్తింపు  తెచ్చుకుంది. అయితే ఆమె విజయ్ దేవరకొండతో చేసిన డియర్ కామ్రెడ్ మూవీ ఫట్ కావడంతో కొంత వెనకబడింది. అందుకే కసిగా ఆమె కొత్త సినిమాలతో తానేంటో ప్రూవ్ చేసుకోవాలనుకుంటోంది.


టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు తో కలసి రష్మిక మందన నటిస్తున్న చిత్రం సరిలేరు నీకెవ్వరు పైనే ఆమె ఆశలు ఇపుడు ఉన్నాయి. ఈ మూవీ సంక్రాంతి బరిలో దిగుతోంది. ఈ మూవీ కనుక హిట్ కొడితే రష్మిక జాతకమే మారిపోతుంది. ఆమె ఎక్కడికో వెళ్ళిపోవడం ఖాయమని అంటున్నారు. రష్మికకు గీతాగోవిందం తరువాత బ్లాక్ బస్టర్ హిట్ లేదు.


ఆ కొరత ఈ మూవీ తీరుస్తుందని ఎన్నో ఆశలు పెట్టుకుంది ఈ ముద్దు గుమ్మ. ఈ మూవీలో ఆమె అసలైన అట్రాక్షన్ అంటున్నారు. ఇక ఈ మూవీ తరువాత బన్నీతో కూడా రష్మిక మరో మూవీ కమిట్ అయింది. అయితే ఈ రిజల్ట్ పూర్తిగా పాజిటివ్ గా  ఉంటేనే మరిన్ని చాన్సులు ఈ అమ్మడు ఇంటి తలుపు తడతాయి అంటున్నారు.


ఇపుడు పూజా హెగ్డె ఒక్కరే రష్మికకు గట్టి  పోటీగా ఉన్నారు. పూజాని దాటేసి ముందుకు దూసుకుపోవాలంటే మాత్రం సరిలేరు హిట్ రష్మికకు చాలా అవసరం. ఫ్యామిలీ ఓరియెంటెడ్ గా, రోమాంటిక్  ఫీల్ తో ఈ మూవీని డైరెక్టర్ రావిపూడి అనిల్ డిజైన్ చేశారు.  సంక్రాంతి హిట్ డైరెక్టర్ గా ఆయనకు పేరుంది. దాంతో పాటు మహేష్ రష్మిక కాంబోకి  ఫ్రెష్ ఫీల్ ఉంటుంది. మొత్తానికి హిట్ వరకూ రష్మికకు కాన్ఫిడెన్స్ ఉంది. చూడాలి ఎంతవరకూ ఈ అమ్మడు జోరు చేస్తుందో.


మరింత సమాచారం తెలుసుకోండి: