విజయ్ దేవరకొండ క్రేజీ హీరోగా కొనసాగుతూనే నిర్మాతగా మారాలని చేసిన తొలి ప్రయత్నం విఫలం కావడంతో విజయ్ దేవరకొండ ఒక షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడు అన్న వార్తలు వస్తున్నాయి. విజయ్ నిర్మాతగా మారి తీసిన ‘మీకు మాత్రమే చెప్తా’ ఫ్లాప్ గా మారడంతో ఇప్పట్లో మరో సినిమాను నిర్మించే ఆలోచనల నుండి విజయ్ విరమించుకున్నట్లు టాక్. 

వాస్తవానికి ఈ మూవీ నిర్మాణం ద్వారా విజయ్ కు లాభాలు వచ్చినా ఈ మూవీని కొనుక్కున్న బయ్యర్లు మాత్రం బాగా నష్టపోయారు. దీనితో ఇలాంటి ప్రయోగాలు ఇప్పట్లో చేయకుండా తన సినిమాల పైనే పూర్తిగా శ్రద్ధ పెట్టాలని విజయ్ దేవరకొండ ఒక స్థిర నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. 

ఈ నిర్ణయం నేపధ్యంలో తన సొంత సినిమాల నిర్మాణ వ్యవహారాలు చూస్తున్న తన తండ్రిని ఈ విషయంలో స్లో అవ్వమని సంకేతాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. అదేవిధంగా ఇప్పటికే తాను తీయబోయే సినిమాలకు సంబంధించి స్క్రిప్ట్ వర్క్స్ ను చేస్తున్న రచయితలను దర్శకులను ఆ పని ఆపుచేయమని చెప్పి ఇప్పటి వరకు వారు చేసిన పనులకు రావలసిన మొత్తాలను సెటిల్ చేసి పంపించి వేసినట్లువార్తలు వినిపిస్తున్నాయి.

ప్రస్తుతం విజయ్ దేవరకొండ  తాను నటించే సినిమాల ప్రాజెక్ట్ విషయాలను తప్ప మరి ఏ విషయాల పై దృష్టి పెట్టకుండా తన హీరో కెరియర్ కు ఏమాత్రం డ్యామేజ్ జరగకుండా అన్ని జాగ్రత్తలు ముందు చూపుతో తీసుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనికితోడు ఈ క్రేజీ హీరో లేటెస్ట్ గా నటిస్తున్న ‘వరల్డ్ ఫేమస్ లవర్’ మూవీని ఎటువంటి పోటీ లేకుండా కేవలం ఒక్క సోలో సినిమాగా విడుదల చేయడానికి అవసరం అనుకుంటే ఎంతకాలం అయినా ఆగుదామని విజయ్ దేవరకొండ తన నిర్మాతలకు స్పష్టమైన సూచనలు ఇప్పటికే ఇచ్చినట్లు టాక్.. 
 



మరింత సమాచారం తెలుసుకోండి: