త్రివిక్రమ్, మహేశ్ మధ్య రిలేషన్ దెబ్బతిందా.. ఫిలింనగర్ లో నడుస్తున్న చర్చ ఇది. త్రివిక్రమ్ హీరోగా అందరి పేర్లు వినిపిస్తున్నాయి. ఈ లిస్ట్ లో మహేశ్ పేరు మాత్రం లేదు. 2015లో మహేశ్ తో సినిమా ఉంటుందని త్రివిక్రమ్ అనౌన్స్ చేశాడు. ఐదేళ్లు దాటినా.. ఈ కాంబినేషన్ ఎందుకు రిపీట్ కాలేదు. 

 

త్రివిక్రమ్ కెరీర్ లో అత్తారింటికి  దారేది.. అరవింద సమేత వీర రాఘవ లాంటి హిట్స్ ఉన్నా.. అల వైకుంఠపురములో లాంటి నాన్ బాహుబలి రికార్డ్ ఉన్నా.. కొంతమందికి మాత్రం మాటల మాంత్రికుడు తీసిన అతడు సినిమా ఎక్కువ ఇంప్రెస్ చేసింది. ఆ తర్వాత వచ్చిన ఖలేజా ఫ్లాప్ అయినా.. మహేశ్ తో పూర్తిస్థాయి కామెడీ పండించాడు దర్శకుడు. 

 

త్రివిక్రమ్, మహేశ్ కాంబినేషన్ లో సినిమా వచ్చి పదేళ్లయింది. హుదూద్ తుఫాన్ సందర్భంగా సినిమా ఇండస్ట్రీ నిర్వహించిన మేము సైతం కార్యక్రమంలో భాగంగా మహేశ్, త్రివిక్రమ్ తో సమంత ఇంటర్వ్యూ చేసింది. మీ కలయికలో సినిమా ఎప్పుడని సమంత అడిగితే.. 2015లో ఉంటుందని త్రివిక్రమ్ బదులిచ్చాడు. 

 

త్రివిక్రమ్ ఎనౌన్స్ చేశాక అదిగో అదిగో అంటూ.. ప్రచారం సాగిందే తప్ప మహేశ్ తో సినిమా సెట్ కాలేదు. అల వైకుంఠపురములో తర్వాత త్రివిక్రమ్ ఎన్టీఆర్ ను డైరెక్ట్ చేయనున్నాడు. ఆ తర్వాత చిరంజీవి.. రామ్ చరణ్.. ప్రభాస్ తో త్రివిక్రమ్ కమిట్ అయ్యాడన్న వార్తలొస్తున్నాయి గానీ.. మహేశ్ పేరు మాత్రం వినిపించలేదు. మధ్య దూరం పెరిగిందని.. ఈ కాంబినేషన్ లో సినిమా ఇప్పట్లో ఉండదంటున్నాయి ఫిలిం వర్గాలు. సంక్రాంతికి వచ్చిన సరిలేరు నీకెవ్వరుతో మహేశ్.. అల వైకుంఠపురముతో త్రివిక్రమ్ తగ్గకుండా పోటీపడి మరీ.. నువ్వానేనా అన్నట్టు చేసిన పబ్లిసిటీ చూస్తుంటే.. ఈ ఇద్దరి మధ్య గ్యాప్ వచ్చినట్టే కనిపిస్తోంది. చూడాలి మరి ముందుముందు ఏం జరుగుతుందో.. !

మరింత సమాచారం తెలుసుకోండి: