జాబ్ లో అయినా సీనియారిటీ పెరుగుతున్న కొద్దీ ఎమోషన్స్ వస్తుంటాయి. కానీ హీరోయిన్లకు మాత్రం డేంజర్ బెల్స్ మోగుతుంటాయి. ఇప్పుడు టాలీవుడ్  లో చాలామంది సీనియర్ల కెరీర్ ఇలాగే క్లైమాక్స్ కు చేరుతోంది. 

 

అనుష్క స్క్రీన్ పై ఉందంటే చాలు థియేటర్లు గోల చేసేవి. యోగాబ్యూటీతో డ్యూయెట్లు పాడుకునేవి. ఇక కాజల్ కనిపిస్తే చందమామను చూసినట్టు చూసేవారు. అదే తమన్నా మెరిస్తే మిల్కీ మ్యాజిక్ లో ఉండిపోయేవారు ప్రేక్షకులు. కానీ ఇప్పుడు ఈ హీరోయిన్లని పెద్దగా పట్టించుకునే మేకర్స్ తక్కువైపోతున్నారు. సీనియర్స్ అని సైడ్ చేస్తున్నారు. 

 

పవర్ ఫుల్ క్యారెక్టర్స్ తో సూపర్ క్రేజ్ తెచ్చుకున్న అనుష్కకి ఇప్పుడు సరైన అవకాశాలే రావట్లేదు. చాలా కష్టపడి సైజ్ జీరో బరువు తగ్గించుకున్నా, స్వీటికి కమర్షియల్ సినిమాల్లో ఆఫర్స్ రావట్లేదు. అనుష్క కటౌట్ కు మేం సెట్ అవ్వమని యంగ్ స్టర్స్ దూరం జరుగుతోంటే.. సీనియర్ హీరోలు కూడా ఆమెను పక్కన పెట్టేస్తున్నారు. దీంతో నిశ్శబ్దంగా ఉండిపోయింది స్వీటీ. 

 

మిల్కీ గ్లామర్ తో మెరుపులు మెరిపించిన తమన్నా కెరీర్ ఇప్పుడు స్లంపులోనే ఉంది. సైరాతో అదరగొట్టినా.. క్రేజీ ఆఫర్స్ అందుకోలేకపోతోంది. టాప్ హీరోలని మెప్పించలేక, మీడియం రేంజ్ హీరోలతో కెరీర్ నెట్టుకొస్తోంది. గోపీచంద్ తో కలిసి నటిస్తోన్న సీటీమార్ తో ఖచ్చితంగా హిట్ కొట్టాల్సిన పరిస్థితిలో పడిపోయింది. 

 

గ్లామర్ ఇండస్ట్రీలో టాలెంట్ తో పాటు అందమూ ఉండాలి. ఈ అందమే హీరోయిన్లని అందళం ఎక్కిస్తుంది. కానీ ఏజ్ తో పాటు తరిగిపోయే అందంతో కెరీర్ నిలబెట్టుకోవడం చాలా కష్టం. రకుల్ లాంటి హీరోయిన్లు ఈ కష్టాల్లోనే పడిపోయారు. ఫిట్ నెస్ కాపాడుకుంటున్నా.. కెరీర్ ను ఫిట్ గా ఉంచుకోలేకపోయింది రకుల్ ప్రీత్ సింగ్. మన్మథుడు 2లో ఓల్డ్ గా కనిపించిందనే కామెంట్స్ తో ఈమెకు టాలీవుడ్ డోర్స్ మూసుకుపోతున్నాయి. టాప్ హీరోలు ఈమెను రిపీట్ చేసేందుకు ఇష్టపడట్లేదు. అందరూ కొత్త ఆప్షన్స్ వెతుక్కుంటున్నారు. దీంతో రకుల్ కెరీర్ క్లైమాక్స్ కు చేరిందనే వార్తలొస్తున్నాయి. 

 

కాజల్ కు నేనే రాజు నేనే మంత్రి తర్వాత సరైన సక్సెస్ లేదు. సీత, రణరంగం లాంటి ఫ్లాపులతో చాలా స్లో అయింది. దీనికి తోడు 35కు చేరువైంది కాజల్. ఈ సీనియారిటీయే ఈమెను యంగ్ స్టర్స్ నుంచి దూరం చేస్తోంది. అలాగే అవకాశాలను దగ్గరకు రానివ్వడం లేదు. ఇప్పుడు కాజల్ చేతిలో కేవలం మంచు విష్ణు మోసగాళ్లు మాత్రమే ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: