ఎమ్మెస్ ధోని అన్ టోల్డ్ స్టోరీలో ఎదో ఎలా ఓ చిన్న పాత్రలో నటించిన కియరా అద్వాని ఆ తర్వాత బాలీవుడ్ ను ఊపేస్తుందని ఎవరు ఊహించి ఉండరు. హిందీలోనే కాదు సౌత్ సినిమాల మీద కూడా కన్నేసింది కియరా. తెలుగులో మహేష్ తో భరత్ అనే నేను, రాం చరణ్ తో వినయ విధేయ రామ సినిమాల్లో నటించిన ఈ అమ్మడికి టాలీవుడ్ లో కూడా భారీ ఆఫర్లు వస్తున్నాయి. బాలీవుడ్ లో లాస్ట్ ఇయర్ కబీర్ సింగ్ హిట్ అమ్మడికి అక్కడ ఫుల్ క్రేజ్ తెచ్చింది. అయితే సినిమాల్లో అభినయంతో మెప్పిస్తున్న కియరా వెబ్ సీరీస్ లలో మాత్రం అందంతో రెచ్చగొడుతుంది.

 

బాలీవుడ్ హీరోయిన్స్ కు ఈమధ్య వెబ్ సీరీస్ ల పిచ్చి పట్టింది. దాదాపు సినిమాకు ఇచ్చే రెమ్యునరేషన్ ఆఫర్ చేయడంతో వెబ్ సీరీస్ లకు ఒకే చెప్పేస్తున్నారు. ముఖ్యంగా కియరా చేసిన లస్ట్ స్టోరీస్ సూపర్ హిట్ అవడం.. అందులో అమ్మడి ఎక్స్ ప్రెషన్స్ కు కుర్రాళ్ళకి పిచ్చి లేపేలా చేశాయి. అయితే ఇక ఇప్పుడు కొత్త వెబ్ సీరీస్ లో కూడా కియరా మరింత డోస్ పెంచి నటించింది. కియరా లేటెస్ట్ వెబ్ సీరీస్ గిల్టీ లో అమ్మడు కుమ్మేసింది. రెగ్యులర్ సినిమాలు చేస్తూనే ఇలా వెబ్ సీరీస్ లో హాట్ ఇమేజ్ సంపాదించడం కేవలం కియరా వల్లే అయ్యిందని అనిపిస్తుంది.

 

ఓ పక్క సినిమాలు చేస్తూ మరో పక్క వెబ్ సీరీస్ లతో సత్తా చాటుతున్న కియరా అద్వాని చూస్తుంటే బాలీవుడ్ ను ఒ ఊపు ఊపేలా ఉంది. ఎలాగు దీపికా, ప్రియాంకా లాంటి హాట్ భామలకు పెళ్లయింది. అలియా, జాన్విలు ఉన్నా తన క్రేజ్ కు వరుస ఛాన్సులు అందుకోవడం ఖాయం. సినిమాల కన్నా వెబ్ సీరీస్ లో కియరా హాట్ షోకి ఆడియెన్స్ కు నిద్ర పట్టకుండా చేస్తుంది. హాట్ గా కనిపిస్తూనే అభినయంతో కూడా కుమ్మేస్తుంది అమ్మడు. కియరా ఫాం చూసి మిగతా హీరోయిన్స్ నోరెళ్ళ బెడుతున్నారంటే నమ్మాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: