ఒక‌ప్పుడు బుల్లితెరపై విశేష ఆధరణ పొందిన యాంక‌ర్ లాస్య గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. తనదైన శైలిలో రాణించిన నెంబర్ వన్‌ అనే పేరును సంపాదించుకొన్నది. ముఖ్యంగా ర‌విలాస్య‌గా ఈ భామ‌కు ఒక‌ప్పుడు మంచి క్రేజ్ ఉంది. రవి,లాస్య వీరిద్దరు బుల్లితెర పై చేసే యాంకరింగ్ ప్రేక్షకులను బాగా అలరించింది. బుల్లితెరమీదనే కాదు బయట జరిగే ఈవెంట్లలో కూడా ఈ ఇద్దరూ చక్కటి యాంకర్ జోడీ గా పేరు తెచ్చుకున్నారు. అలాగే ఈ ఇద్దరిమీదా వచ్చినన్ని రూమర్లు టాలీవుడ్ సినీ తారల మీద‌ కూడా రాలేదంటే ఆశ్చర్యం లేదు.

 

ముఖ్యంగా వీళ్లిద్దరూ కలిసి చేసిన ‘సంథింగ్ స్పెషల్' సూపర్ పాపులరైంది. వీళ్లిద్దరూ ప్రేమించుకుంటున్నారేమో అనుకునేంతగా వాళ్ల కెమిస్ట్రీ  ఉండేది. ఇక కార‌ణాలు ఏంటో తెలియ‌దు కానీ, ర‌వితో విడిపోయిన లాస్య‌ స‌ప‌రేట్‌గా ప్రోగ్రామ్స్ చేసింది. అయితే రవి నుంచి విడిపోయిన తర్వాత ఈమె పెద్దగా సక్సెస్ కాలేద‌నే చెప్పాలి. ఆ తర్వాత రెండేళ్ళ కింద ప్రేమిస్తున్న‌ మంజునాధ్ అనే  మరాఠీ కుర్రాన్ని పెళ్లి చేసుకుంది లాస్య‌. ఇక  పెళ్లైన త‌ర్వాత టీవీ షోలు మానేసి హాయిగా భర్త, బిడ్డతో సెటిలై లైఫ్‌ను సూప‌ర్‌గా ఎంజాయ్ చేస్తుంది. 

 

ఈ మధ్యే తన కొత్త బిజినెస్ కూడా మొదలుపెట్టింది ఈమె. అందులో బాగానే దుమ్ము దులిపేస్తుంది లాస్య. పైగా భర్త అండదండలు కూడా ఉండటంతో ఎంతో చురుగ్గా  ముందుకు సాగుతోంది ఈ ముద్దుగుమ్మ. లాస్య ప్రస్తుతం స్క్రీన్ ‌పై కనిపించడం పూర్తిగా మానేసింది. పైగా బాగా లావు కూడా అయిపోవడంతో అవకాశాలు కూడా తగ్గిపోయాయి. కానీ, లాస్య టాక్స్ అంటూ ఇటీవ‌ల‌ ఓ యూ ట్యూబ్ ఛానెల్ పెట్టుకుంది. అందులోనే తనకు సంబంధించిన వీడియోలతో పాటు వంట వీడియోలు కూడా పోస్ట్ చేస్తుంది. ప్ర‌స్తుతం ఈమె యూ ట్యూబ్ ఛానెల్ ఓ రేంజ్‌లో దూసుకుపోతోంది. ఏదేమైనా ర‌వితో విడిపోయిన‌ప్ప‌టికీ లాస్య లైఫ్‌లో మాత్రం బాగానే సెటిల్ అయింది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: