టాలీవుడ్ లో అల్లు అర్జున్ కి ఇప్పటివరకు ఉన్న క్రేజ్ వేరు, అల వైకుంఠపురములో సినిమా విడుదల తర్వాత ఏర్పడిన క్రేజ్ వేరు .ఇప్పటివరకు కమర్షియల్ హీరోగా అవతారం ఎత్తడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ వచ్చిన బన్నీకి ఒక్కటంటే ఒక్కటి కూడా సరైన హిట్ లు ఈ మధ్యకాలంలో లభించలేదు. దీంతో త్రివిక్రమ్ దర్శకత్వంలో ఈ సినిమాను సీరియస్ గా తీసుకున్న అల్లు అర్జున్సినిమా కోసం తీవ్రంగానే కష్టపడ్డాడు. కనీసం ఎవరిని కలవకుండా ఈ సినిమాను పూర్తి చేశాడు అల్లు అర్జున్. ఈ సినిమా అతని కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్స్ లో ఒకటిగా నిలిచింది.

 

వాస్తవానికి సంక్రాంతి బరిలో ఏ సినిమా కూడా ఈ స్థాయిలో ఆకట్టుకోలేదు అనేది వాస్తవం. సంక్రాంతి మూడు, నాలుగు సినిమాలు విడుదలైన అల్లు అర్జున్ సినిమా మంచి వసూళ్లు సాధించింది. ఇది పక్కన పెడితే ఈ సినిమా తర్వాత అల్లు అర్జున్ కోసం బాలీవుడ్ నిర్మాతలు కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇటీవల బాలీవుడ్ అగ్ర నిర్మాత గా ఉన్నా ఒక నిర్మాత అల్లు అర్జున్ తో సినిమా చేయడం కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేశాడు.

 

అల వైకుంఠపురములో బాలీవుడ్ లో కూడా తెరకెక్కించడానికి తీవ్రంగా ప్రయత్నాలు చేస్తూ ఆ నిర్మాత సల్మాన్ ఖాన్ తో మాట్లాడినట్టు సమాచారం. కూడా అల్లు అర్జున్ తో సినిమా చేసేందుకు గానూ ఆ నిర్మాత హైదరాబాద్ కూడా వచ్చి వెళ్లినట్లు తెలుస్తోంది. అల్లు అరవింద్ తో కలిసి ఆ సినిమా నిర్మించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారట. అయితే అల్లు అర్జున్ మాత్రం తనకు రెండేళ్ల వరకు కుదరదని వరుసగా సినిమాలు ఉన్నాయని ఈ రెండేళ్ల లో తాను మూడు సినిమాలను విడుదల చేయాలని భావిస్తున్నట్టు సదరు నిర్మాతకు స్పష్టంగా చెప్పినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సుకుమార్ సినిమా చేస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: