టాలీవుడ్ లో అగ్ర దర్శకుడు ఎవరంటే టక్కున గుర్తొచ్చే పేరు పూరీ జగన్నాథ్. అసిస్టెంట్ డైరెక్టర్ గా సినిమా కెరీర్ ప్రారంభించిన పూరీ, తర్వాత రోజుల్లో బద్రి, ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం, ఇడియట్, శివమణి, సూపర్, పోకిరి, చిరుత, బిజినెస్ మ్యాన్, నేనింతే చిత్రాలతో డేర్ అండ్ డాషింగ్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. టాలీవుడ్ లోని టాప్ హీరోలందర్ని డైరెక్ట్ చేసిన పూరీ ఇటు తెలుగుతో పాటు ఇతర భాషల్లో కూడా తన టాలెంట్ ను చూపించాడు. కన్నడ, హిందీ చిత్ర పరిశ్రమలల్లో పూరీకి ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు. బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ తో సినిమా తీసి హిందీ ప్రేక్షకుల మెప్పు కూడా పొందాడు. ఇదిలా ఉండగా కరోనా వైరస్ వ్యాప్తి నివారణ చర్యలలో భాగంగా తలపెట్టిన జనతా కర్ఫ్యూకు దేశ ప్రజానీకం చప్పట్లతో సంఘీభావం తెలిపిన సంగతి తెలిసిందే.

 

దేశ శ్రేయస్సు కోసం పోరాడుతున్న వైద్యులు, అధికారులు, కార్మికులు, పోలీసులందరికీ కరతాళ ధ్వనులతో తమ మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా డేరింగ్ డైరెక్టర్ పూరీ కూడా చప్పట్లు కొడుతూ వారికి సంఘీభావం తెలిపారు. ఈ చప్పట్ల వీడియోను నటి చార్మీ కౌర్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. పూరీ సినిమాల్లో హీరోలతో చెప్పించే డైలాగ్స్ మాదిరిగా ఈ వీడియోలో తనదైన స్టైల్లో 'గో...నీ అయ్య కరోనా...గో' నినదించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలలో వైరల్ అవుతుంది.


ప్రెజెంట్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో విజయ దేవరకొండ, అనన్య పాండే హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా 'ఫైటర్'. ఈ చిత్రాన్ని అన్ని దక్షిణ భాషలతో పాటు హిందీలో కూడా ఒకేసారి తెరకెక్కిస్తున్నారు. ఫైటర్ కథలో పాన్ ఇండియా అప్పీల్ ఉందని భావించిన కరణ్ జోహార్ కూడా పూరి, ఛార్మిలతో కలిసి ఈ సినిమా నిర్మాణంలో భాగస్వామి అయ్యాడు. ముంబైలో 40 రోజులు షూటింగ్ జరుపుకున్న చిత్రబృందం ఇటీవలే హైదరాబాద్ కి తిరిగి వచ్చింది. ప్రస్తుతం కరోనా నేపథ్యంలో షూటింగ్ కి బ్రేక్ తీసుకొని రెస్ట్ తీసుకుంటున్నాడు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: