బుల్లితెర మీద క్రేజీ జంటగా పాపులారిటీ తెచ్చుకున్న యాంకర్ రవి, లాస్య కొన్నాళ్లుగా కలిసి కనిపించడం మానేశారు. రవితో గొడవ తర్వాత లాస్య స్మాల్ స్క్రీన్ కు దూరమైంది. పెళ్లి తర్వాత పూర్తిగా కనిపించడం మానేసింది. ఈమధ్యనే ఒక యూట్యూబ్ ఛానెల్ స్టార్ట్ చేసి  ప్రేక్షకులను అలరిస్తున్న లాస్య రీసెంట్ గా ఈటివి స్పెషల్ షోలో కనిపించి అలరించింది. రవి, లాస్య ఇద్దరు చేసిన ప్రోగ్రామ్స్ సూపర్ సక్సెస్ అయ్యాయి. వాళ్ళిద్దరికీ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. 

 

మధ్యలో కొన్ని కారణాల వల్ల వాళ్ళిద్దరు సెపరేట్ అవ్వాల్సి వచ్చింది. మా మార్నింగ్ కాఫీ, సంథింగ్ స్పెషల్ ప్రోగ్రామ్స్ లో రవి, లాస్య ల యాంకరింగ్ బాగా క్రేజ్ తెచ్చుకుంది. రవి లేకుండా లాస్య.. లాస్య లేకుండా రవి షో చేయరు అన్న టాక్ వచ్చింది. ఢీ లో కూడా అపోజిట్ టీం లీడర్స్ గా రవి, లాస్య చేశారు.అయితే అలాంటి టైం లోనే సోలోగా ప్రోగ్రామ్ చేయాలని అనుకున్న రవి లాస్యని కాని నన్ను కాని ఎవరినో ఒకరిని తీసేయమని అన్నాడట. అయితే వాళ్ళు ఇద్దరినీ తీసేశారని తెలుసుకుని.. రవి పటాస్ షోకి ఓకే చెప్పాడు. అక్కడ శ్రీముఖితో రవి హంగామా తెలిసిందే. రవికి అయితే వెంటనే షో దొరికింది కాని లాస్యకు మాత్రం వేరే షో దొరకలేదట. అందుకే రవి మీద లాస్య కోపం పెంచుకుందని తెలుస్తుంది. 

 

రవితో గొడవ తర్వాత లాస్య స్మాల్ స్క్రీన్ కు దూరమైంది. ఇక మంజునాథ్ ను పెళ్లాడిన తర్వాత కొన్నాళ్లు గ్యాప్ ఇచ్చి యూట్యూబ్ ఛానెల్ తో సర్ ప్రైజ్ చేసింది. లాస్య రీ ఎంట్రీ కోసం ఆమె ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. మళ్ళీ స్మాల్ స్క్రీన్ పై లాస్య అల్లరి చూడాలని ఆమె ఫాలోవర్స్ కోరుకుంటున్నారు. ఒక మంచి షోతో త్వరలో మీ ముందుకొస్తా అని కొన్నాళ్ల క్రితం చెప్పిన లాస్య ఇంకా ఆ షో మొదలుపెట్టలేదు. లాస్య మళ్ళీ బుల్లితెర మీద సందడి చేయడం మొదలు పెడితే ఆమె ఫ్యాన్స్ కు పండుగే అని చెప్పొచ్చు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: