టాలీవుడ్ లో చేసిన సినిమాలు తక్కువే అయినా సరే నిత్యా మీనన్ కి వచ్చిన గుర్తింపు అందరికి తెలిసిందే. ఆమె టాలీవుడ్ లో ఒకప్పుడు స్టార్ హీరోయిన్ అవుతుంది అని భావించారు అందరూ. కాని ఆ తర్వాత ఆమె సినిమాల్లో ఎక్కువగా కనపడలేదు. మంచి సినిమాలు చేసినా సరే ఆమెను మాత్రం మెయిన్ హీరోయిన్ గా అసలు ఏ దర్శకుడు తీసుకోలేదు. చిన్న దర్శకులు చిన్న సినిమాల్లో మాత్రమే ఆమెకు హీరోయిన్ గా అవకాశం ఇచ్చారు అనేది అర్ధమైంది. ఆ తర్వాత ఆమెకు బాలీవుడ్ లో అవకాశాలు వచ్చాయి. 

 

అక్కడి నుంచి ఆమె బాలీవుడ్ మీదే ఇప్పుడు దృష్టి పెట్టింది. ఆమె అక్కడ చేసిన ఒక సినిమా సూపర్ హిట్ అయింది. ఇక అక్కడి నుంచి ఆమె బాలీవుడ్ కి దూరం కావొద్దు అని భావిస్తున్నట్టు సమాచారం. తమిళంలో మలయాళం లో అవకాశాలు వచ్చినా సరే ఆమె మాత్రం సినిమాలకు ఓకే చెయ్యలేదు. ఇప్పుడు చేసే ఒకటి రెండు సినిమాలు అయినా సరే బాలీవుడ్ లోనే చెయ్యాలని భావిస్తున్నట్టు తెలుస్తుంది. ఇక టాలీవుడ్ లో అయితే అసలు సినిమాలు వద్దని భావిస్తున్నట్టు సమాచారం. టాలీవుడ్ దర్శకులు ఆమెను అడిగినా సరే ఆమె మాత్రం వద్దని చెప్పినట్టే సమాచారం. 

 

ప్రస్తుతం బాలీవుడ్ లో ఆమె చేతిలో మూడు సినిమాలు ఉన్నాయి. ఈ సినిమాలను పూర్తి చేస్తుంది. అయితే పెళ్లి చేసుకునే అవకాశాలు కూడా ఉన్నాయని అన్నారు. కాని సినిమాలను పూర్తి చేసిన తర్వాత పెళ్లి గురించి ఆలోచించాలని ఆమె భావిస్తుంది. ప్రస్తుతం ఆమెకు మంచి డిమాండ్ ఉంది. హీరోయిన్ గా కాకపోయినా సరే నటి గా మాత్రం ఆమె రాణించాలి అని భావిస్తుంది. అందుకే అక్కడ ఏ పాత్ర వచ్చినా సరే నటనకు ప్రాధాన్యత ఉంటే చెయ్యాలి అని భావిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: