కరోనా వైరస్ నేపధ్యంలో ఇప్పుడు షూటింగ్ లు అన్నీ ఆగిపోయాయి. ఇప్పట్లో కెమెరా ఆన్ చేసే పరిస్థితి దాదాపుగా కనపడట౦ లేదు. దేశ వ్యాప్తంగా ఏ సినిమా కూడా ఇప్పట్లో షూటింగ్ కి వెళ్ళే అవకాశం కనపడటం లేదు. దీనితో అగ్ర హీరోల సినిమాలు కూడా ఆగిపోయిన పరిస్థితి ప్రస్తుతం నెలకొంది. టాలీవుడ్ లో అగ్ర హీరోల సినిమాలు వాయిదా పడటం తో నిర్మాతలు ఇప్పుడు సినిమాల గురించి కంగారు పడుతున్నారు. అగ్ర దర్శకులు కూడా సినిమాల విషయంలో ఎన్నో ఆశలు పెట్టుకున్నా సరే ప్రస్తుత పరిస్థితిల్లో షూటింగ్ కి వెళ్ళే అవకాశం లేదు. 

 

ఇప్పుడు లాక్ డౌన్ ని పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనితో వచ్చే నెల మొదటి వార౦ వరకు ఏ అవకాశం లేదు అనే విషయం అర్ధమవుతుంది. ఇది పక్కన పెడితే ఇప్పుడు ఒక విషయం బయటకు వచ్చింది. టాలీవుడ్ లో ప్రతిష్టాత్మక సినిమాగా భావిస్తున్న ఆర్ఆర్ఆర్ షూటింగ్ ని రాజమౌళి చేస్తున్నట్టు సమాచారం. అయితే ఎక్కువ మంది సిబ్బంది లేకుండా దీన్ని చేస్తున్నట్టు తెలుస్తుంది. చిన్న చిన్న కుటుంబ సన్నివేశాలను షూట్ చేస్తున్నారట. తన ఇంటి బయట పెరట్లో కూడా చిన్న పిల్లలు ఉండే సన్నివేశాలను జాగ్రత్తగా షూట్ చేస్తున్నట్టు సమాచారం. 

 

ఇంటికి వచ్చే వాళ్ళు అందరికి ధర్మల్ స్క్రీనింగ్ నిర్వహించి... వాళ్లను షూటింగ్ కి తీసుకుంటున్నారట. కేవలం అవసరం ఉన్న వాళ్ళను మాత్రమే తీసుకుని షూట్ చేస్తున్నట్టు సమాచారం. ఈ సినిమాలో జక్కన్న పెట్టుబడి కూడా ఉంది. ఇక హీరోలను కూడా డబ్బింగ్ పూర్తి చెయ్యాలని సూచించినట్టు తెలుస్తుంది. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకి వచ్చే అవకాశం ఉంది. ఈ సినిమాకు సంబంధించి కీలక సన్నివేశాలను ఇప్పటికే చిత్ర యూనిట్ షూట్ చేసిన సంగతి తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: