హీరోయిన్లు  ఈ లాక్ డౌన్ పీరియడ్ లో  వంటలు మాత్రమే కాకుండా వర్కవుట్స్ చేస్తూ.. ఇంట్లోనే బిజీ గా ఉన్నారు. బాలీవుడ్ క్వీన్ కరీనా కపూర్.. ఇంట్లో తన జిమ్ లో వర్కవుట్ చేస్తున్న పిక్ పోస్ట్ చేసింది. సైఫ్ , తైమూర్ గార్డెనింగ్ లో బిజీగా ఉన్నారు. నేను జిమ్ లో ఉన్నానంటూ మెసేజ్ కూడా పెట్టింది కరీనా. బాలీవుడ్ లో ఫస్ట్ టైమ్ జీరో సైజ్ చేసి ట్రెండ్ క్రియేట్ చేసింది కరీనా. ఇప్పటికీ అదే ఫిజిక్ ని మెయింటెన్ చేస్తోంది ఈ సీనియర్ హీరోయిన్.

 

మరో ఫిట్ నెస్ ఫ్రీక్ అయిన శిల్పాశెట్టి కూడా  ఇంట్లో నే తెగ కసరత్తులు చేస్తోంది. బాలీవుడ్ లో ఫిట్టెస్ట్ హీరోయిన్ అయిన శిల్పా.. తన కొడుకుతోకలసి వర్కవుట్స్ చేస్తూ..ఇంట్లోనే నాకు పెద్ద కాంపిటీషన్ అని పోస్ట్ చేసింది.  ఇప్పటి వరకూ ఇంట్లో ఒక్కదాన్నే చేసేదాన్ని.. ఇప్పుడు నాకు నా కొడుకు కూడా యాడ్ అయ్యాడని చాలా హ్యాపీగా చెబుతోంది  ఈ ఎవర్ ఫిట్టెస్ట్ భామ.

 

ఇక కత్రినా కైఫ్ అయితే .. లాక్ డౌన్ కదా.. ఏదో రెస్ట్ తీసుకుందాం అనుకోకుండా ఫుల్ గా వర్కవుట్స్ చేస్తోంది. ఇంట్లోనే అన్ని రకాల పనులు చేస్తోంది. అంతేకాదు టెర్రస్ మీద యోగా చేస్తూ.. మీరు కూడా సోషల్ డిస్టెన్స్ మెయింటెన్ చేస్తూ.. ఎక్సర్ సైజెస్ చెయ్యండి..హెల్తీగా ఉండండని చెబుతోంది.

 

ఇక ఇటు టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ ని కూడా కవర్ చేస్తున్న రకుల్ ఇంట్లోనే ఎక్సర్ సైజ్ లు చేస్తోంది. అసలు తిండి తినడం మానేస్తామేమో కానీ .. వర్కవుట్ చెయ్యడం మాత్రం మానను అంటూ..జఇలా అందరు స్టార్లు.. తమఇంట్లోని జిమ్ లోనే లాక్ డౌన్ పీరియడ్ ని వర్కవుట్స్ తో ఎంజాయ్ చేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: