అభిమానులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సమయం వచ్చేసింది. రాజమౌళి దర్శకత్వంలో మహేష్ సినిమా ఉంటుందా లేదా అన్న అనుమానాలకి తెర పడింది. ఎప్పటి నుండో వీరిద్దరి కాంబినేషన్లో సినిమా రావాలని చాలా మంది కోరుకుంటున్నారు. పదేళ్ల క్రితం వీరిద్దై మధ్య సినిమా చర్చలు కూడా జరిగాయట. కానీ ఏదీ కార్యరూపం దాల్చలేదు. దాంతో రాజమౌళి దర్శకత్వంలో మహేష్ సినిమా ఉండదని ఫిక్స్ అయిపోయారు.

 

 

అయితే సడెన్ గా రాజమౌళి పెద్ద బాంబు పేల్చాడు. ఆర్.ఆర్.ఆర్ సినిమా తర్వాత మహేష్ బాబుతో సినిమా ఉంటుందని, దానికి నిర్మాతగా కే ఎల్ నారాయణరావు వ్యవహరిస్తారని చెప్పేశాడు. గత కొద్ది రోజులుగా స్టార్ డైరెక్టర్లందరితో ఏదో ఒక కారణం వల్ల మహేష్ దూరం అవుతూనే ఉన్నాడు. దాంతో ఆయన అభిమానుల్లో ఒకలాంటి నిరాశ ఆవరించింది. అయితే రాజమౌళితో సినిమా అనగానే అవన్నీ ఒక్కసారిగా దూదిపింజల్లా ఎగిరిపోయాయి.

 


మహేష్ తో సినిమా చేస్తున్నాడు సరే. మరి ఆ సినిమా ఎలా ఉంటుంది. మహేష్ ని రాజమౌళి ఏ విధంగా చూపించబోతున్నాడు.. అన్న ప్రశ్నలు అధికమయ్యాయి. అయితే వీటికి సమాధానం రాజమౌళి ఆర్.ఆర్.ఆర్ లాంఛింగ్ లోనే చెప్పాడు. ఆర్.ఆర్.ఆర్ లో మహేష్ ని ఎందుకు తీసుకోలేదని అడగ్గా, మహేష్ తో సినిమా అంటే జేమ్స్ బాండ్ తరహా స్క్రిప్ట్ తోనే చేయాలి అన్నాడు. అదీ కాకుండా పదేళ్ల క్రితం రాజమౌళి మహేష్ తో చేయాలనుకున్న చిత్రం కూడా ఆ తరహాదేనని అంటున్నారు.

 

అందువల్ల రాజమౌళి సినిమాలో మహేష్ జేమ్స్ బాండ్ తరహా పాత్ర మాదిరిగా కనిపించనున్నాడని అనుకుంటున్నారు. పీరియాడికల్ డ్రామా కాకుండా థ్రిల్లర్ జోనర్ లో తెరకెక్కే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇంకో విషయం, మహేష్ అభిమానులు కోరుకుంటున్న పాన్ ఇండియా మూవీ కూడా ఇదే అయ్యేలా ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: