నటసింహం నందమూరి బాలకృష్ణ ఒకానొక సందర్భం లో ఓ అందమైన యువతిని చూసి వెంటనే మనసు పడ్డాడట(లవ్ ఎట్ ఫస్ట్ సైట్). ఎంతగా మనసు పడ్డాడు అంటే... ఆమె అందమైన రూపాన్ని చాలా రోజుల వరకు మరువలేక పోయాడట. తెలిసిన వారి పెళ్లి కి వెళ్లిన బాలకృష్ణ ఆ యువతి ని చూడగానే... "ఆహా, ఎవరీ అమ్మాయి. ఇంత రమణీయంగా ఉంది", అని తనలో తాను అనుకుంటూ కొయ్యబారి పోయాడట. ఈ విషయాలన్నీ సాక్షాత్తు బాలకృష్ణ నే ఓ ప్రముఖ చానల్ ఇంటర్వ్యూలో తెలిపాడు. అయితే కొన్ని వారాలు గడిచిన అనంతరం బాలకృష్ణ కోసం సీనియర్ ఎన్టీఆర్ మంచి పెళ్లి సంబంధం చూశారట. తండ్రి మాట కాదనలేక ఆ పెళ్లిచూపులు కి అయిష్టంగానే హాజరైన బాలకృష్ణ... అమ్మాయిని చూడగానే ఒక్కసారిగా నిర్ఘాంతపోయి తర్వాత తేరుకొని తెగ సంతోషపడ్డాడట. ఎందుకంటే తాను మునుపు ఓ పెళ్లి లో చూసి మనసు పడ్డ ఆ అమ్మాయినే తాను పెళ్లి చూపులు చూడడానికి వచ్చాడట. ఇంతకీ బాలయ్య మెచ్చిన ఆ యువతి ఎవరు అంటే... ప్రస్తుత బాలకృష్ణ సతీమణి వసుంధర దేవి.


పెళ్లిచూపుల అనంతరం బాలయ్య వసుంధరాదేవి మధ్య స్నేహం, ప్రేమ చిగురించి ఒకరినొకరు బాగా అర్థం చేసుకొని 1982లో పెళ్లి చేసుకున్నారు. వీరి 38 ఏళ్ళ వివాహబంధంలో ఇద్దరు బిడ్డలు, ఓ కొడుకు పుట్టారు. వసుంధరాదేవి కి చాలా ఓపిక ఉంటుందని... బాలకృష్ణ సినిమా షూటింగ్ లలో బిజీగా ఉన్నప్పటికీ వసుంధర మాత్రం తన పిల్లలకు ఏ లోటు రాకుండా చూసుకుంటుందని సన్నిహితులు చెబుతుంటారు.


బాలకృష్ణ యొక్క అన్నీ విషయాలు తానే చూసుకుంటుంది, చివరికి బాలయ్య బాబు సినీ రెమ్యూనరేషన్ కూడా డిసైడ్ చేసేది వసుంధర దేవేనట. ఒక సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయిందని బాలయ్య బాబు తదుపరి సినిమా యొక్క రెమ్యూనిరేషన్ అసలు పెంచకుండా నిర్మాతలకు మంచి చేస్తుందట. బాలయ్య చాలా కోపిష్టి కాబట్టి తనతో మాట్లాడే కంటే తన భార్య వసుంధరాదేవి తో మాట్లాడటమే శ్రేయస్కరమని నిర్మాతలు కూడా భావిస్తారు. ఏదేమైనా దాదాపు నాలుగు దశాబ్దాల వారి వివాహ బంధంలో ఎటువంటి కలతలు లేకపోవడానికి వసుంధర ఓపికే కారణమని చాలా మంది చెబుతుంటారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: