టాలీవుడ్ లో యంగ్ హీరోల్లో నితిన్ కి మంచి క్రేజ్ ఉందన్న సంగతి తెలిసిందే. అంతేకాదు నితిన్ సినిమాలి మరీ భారీగా డిజాస్టర్ అయిన సందర్భాలు చాలా తక్కువే. నాని మాదిరిగా నితిన్ సినిమాలు పెట్టిన డబ్బులు పెట్టినట్టు తిరిగి వస్తాయి. ఏదో చాలా తక్కువ సందర్భాలలో భారీ ఫ్లాప్స్ గా మిగులుతాయి. అంతేకాదు మినిమం గ్యారెంటీ హీరో అన్న టాక్ కూడా ఇండస్ట్రీలో నాని కి ఉంది. అయితే నాలుగేళ్ళ క్రితం వచ్చిన అ..ఆ సినిమాతో హిట్ అందుకున్న నితిన్ కి మళ్ళీ హిట్ పడలేదు.

 

అందుకే కాస్త గ్యాప్ తీసుకొని మళ్ళీ సినిమాలి మొదలు పెట్టాడు. ఇటీవల వెంకీ కుడుముల దర్శకత్వంలో భీష్మ సినిమాని చేశాడు. ఈ సినిమా ఫస్ట్ లుక్ అండ్ టీజర్, ట్రైలర్ తో సినిమా బాగా అంచనాలు భారీగా పెరిగాయి. సాంగ్ టీజర్స్ కూడా ఇంకా ప్రేక్షకుల్లో అంచానాలు పెంచాయి. అంతేకాదు సినిమా రిలీజ్ అయ్యాక పాజిటివ్ టాక్ రావడంతో పెద్ద హిట్ గా నిలిచింది. ఫస్ట్ డే నుంచే సూపర్ హిట్ టాక్ రావడంతో సినిమాకి బాగా కలిసి వచ్చింది. ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ 10 కోట్ల అవడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయింది.

 

ఇక ఈ సినిమా సూపర్ హిట్ తో నితిన్ మళ్ళీ ఫాం లోకి వచ్చాడు. అంతేకాదు ప్రస్తుతం వెంకీ అట్లూరి దర్శకత్వంలో రంగ్ దే సినిమాని చేస్తున్నాడు. నహానటి ఫేం కీర్తి సురేష్ నితిన్ కి జంటగా నటిస్తుంది. అయితే కరోనా ఎఫెక్ట్ తో ఈ సినిమా షూటిం కి బ్రేక్ పడింది. ఇదే కాదు ఈ సినిమా రిలీజ్ ఈ సంవత్సరం ఉంటుందా ఉండదా అన్న అనుమానాలు నెలకొన్నాయి.  భీష్మ సినిమాతో వచ్చిన సక్సస్ ని కంటిన్యూ చేద్దామనుకున్న నితిన్ కి పెద్ద షాకే పడింది. ఈ సినిమా తర్వాత కమిటయిన ప్రాజెక్ట్స్ కూడా ఇప్పుడు షెడ్యూల్స్ అన్ని మారిపోతున్నాయని అంటున్నారు. సినిమాలే కాదు నితిన్ మ్యారేజ్ కూడా పోస్ట్ పోన్ అయింది. మరి లాక్ డౌన్ నేపథ్యంలో పెళ్ళి ఎప్పుడు అన్నది క్లారిటి లేదు.  

మరింత సమాచారం తెలుసుకోండి: