పూరి జగన్నాథ్, దశరథ్, వీరుపోట్ల దర్శకుల వద్ద పనిచేసిన హ్యాపీడేస్ ఫేమ్ నిఖిల్ హీరోగా యువత సినిమాకి దర్శకత్వం వహించిన పరశురామ్, ఇప్పటి వరకు అన్నీ క్లాస్ సినిమాలే చేశాడు. యువత, సారొచ్చారు, సోలో, గీత గోవిందం సినిమాలన్నీ క్లాస్ టచ్ ఉన్నవే. రవితేజతో చేసిన ఒక్క అంజనేయులు సినిమాలో మాత్రమే కమర్షియల్ కంటెంట్ వైపు వెళ్ళాడు. గీత గోవిందం సినిమాతో తన గీత మార్చుకున్న పరశురామ్ మహేష్ తో సినిమా చేసే అవకాశం పట్టేసాడు.

 

సరిలేరు నీకెవ్వరు సినిమా తర్వాత మహేష్ బాబు తర్వాతి సినిమా ఎవరితో ఉంటుందన్నది ఇప్పటి వరకు కన్ఫర్మ్ కాలేదు. అయితే తాజాగా ఈ విషయమై పరశురామ్ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు. లాక్డౌన్ కారణంగా ఇంట్లోనే ఉన్న పరశురామ్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఒకానొక చానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో అనేక విషయాలు పంచుకున్నాడు. తాను సినిమాల్లోకి రావడానికి కారణమైన మహేష్ బాబుతో సినిమా చేయబోతున్నందుకు చాలా ఆనందంగా ఉందని చెప్పుకొచ్చాడు.

 

దీంతో మహేష్ నెక్స్ట్ మూవీ పరశురామ్ తో కన్ఫర్మ్ అయిందని అర్థం అయింది. ఈ విషయమై లాక్డౌన్ పూర్తయ్యాక అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. అయితే పరశురా తెరకెక్కించే ఈ సినిమా గురించి మహేష్ అభిమానుల్లో చాలా సందేహాలున్నాయి. క్లాస్ సినిమాలు తీసిన పరశురామ్ మహేష్ బాబుని ఎలా చూపిస్తాడన్న అనుమానం కలుగుతుంది. స్టార్ హీరో సినిమాలో ఉండాల్సినవన్నీ ఈ సినిమాలో ఉంటాయా అని అడుగుతున్నారు.

 

అయితే దీనికి సమాధానంగా పరశురామ్ మాట్లాడుతూ, అభిమానులు ఆ విషయంలో కంగారు పడాల్సిన అవసరం లేదనీ, అభిమానులకి కావాల్సిన హీరో ఎలివేషన్స్, పంచ్ డైలాగులలు అన్నీ ఉంటాయని చెబుతున్నాడు. ఇప్పటి వరకూ తాను చేసిన సినిమాల్లో అలాంటివి రాసే అవకాశం రాలేదని, లానీ ప్రస్తుతం ఆ అవకాశం వచ్చినందున రాస్తున్నానని చెబుతున్నాడు. అవకాశం రాక రాయలేదనీ, అంతేకానీ రాయడం చేతకాక కాదనని అన్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: