పూరి జగన్నాధ్ ఇండస్ట్రీకి చాలా మంచి సపోర్ట్తో వచ్చారు. కొన్ని రోజులు అసిస్టెంట్ డెరెక్టర్గా కెరియర్ మొదలు పెట్టినప్పటికీ పవన్ సినిమా తీసి మంచి హిట్ కొట్టారు. ఆ తర్వాత ఆయన ఎంతో మంది హీరోలకు ఎన్నో హిట్లను అందించారు. ఒకప్పుడు పూరి దర్శకత్వంలో ఒక్క సినిమా అన్నా తీయాలని హీరోలు తెగ ఉవ్విళ్ళూరేవాళ్ళు. అంతలా ఆయనకు క్రేజ్ ఉండేది. ఇక ఒకానొక సందర్భంలో అయితే ఆయనకు ఏకంగా కొంత మంది ఫ్యాన్స్ ఆయన విగ్రహాన్ని కూడా కట్టించారు. ఇక సినీ హీరో. హీరోయిన్ లకు వీరాభిమానులు విగ్రహాలు. దేవాలయాలు కట్టడం తెలిసిందే. తమిళ నాట ఈ ట్రెండ్ ఎక్కువుగా ఉంటుంది. అయితే తెర వెనక వుండే దర్శకుడికి విగ్రహాం కట్టడం అనేది చాలా అరుదనే చెప్పాలి. అయితే ఈ గౌరవం డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ కు దక్కింది. కరీంనగర్ కు చెందిన జగన్నాధ్ వీరాభిమానులు కొందరు పూరి జగన్నాధ్ కు విగ్రహాం కట్టించి ..ఘనంగా ఆవిష్కరించారు. పూరి జగన్నాధ్ తనయుడు ఆకాష్ పూరి ఈ విగ్రహాన్ని ఆవిష్కరించి వారిని మరింత ఆనందింప చేశారు. అంత క్రేజ్ ఉన్న ఈ దర్శకుడు ఒకానొక సందర్భంలో కాస్త డల్ అవ్వాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి.
ఎప్పుడైతే ఆయన జూనియర్ ఎన్టీఆర్ తో ఆంధ్రావాలా చిత్రం ఫ్లాప్ అయిందో అప్పుడు కొంచం ఇబ్బందుల్లో పడ్డాడు. ఇక పూరి సినిమాలు తీస్తూ డబ్బులు సంపాదించడమేకాని ఎప్పుడూ కూడా ఆయన దాన్ని జాగ్రత్త పరుచుకోవడం అనేది లేదు. అదే సమయంలో ఆయన నమ్మిన స్నేహితుడు మోసం చెయ్యడం ఆయన సంపాదించిన వందకోట్లు పోగొట్టుకోవడం ఇదంతా జరిగిపోయింది. దాంతో ఆయన కాస్త ఇబ్బందుల్లో పడ్డారు. అదే సమయంలో టాలీవుడ్ సీనియర్ కమెడియన్ ఆయనకు కాస్త అండగా నిలబడి సహాయం కూడా చేశారని సమాచారం. ఇక మెహబూబా కథ రెఢీ అయినప్పుడు కొడుకుతో అనుకోలేదు. వేరే ఎవరన్నా యంగ్ హీరోని పెట్టి సినిమా చేద్దాం అనుకుంటే పూరి ఫ్లాప్ల్లో ఉండటం వల్ల ఎవ్వరూ కూడా ముందుకు రాలేదు. ఇక మహేష్తో కూడా సినిమా చేద్దామని ప్రయత్నించినప్పటికీ మహేష్ కూడా ఒప్పుకోలేదు. ఇక ఇటీవలె హిట్ కొట్టిన ఇస్మార్ట్ శంకర్ చిత్రం రామ్ కూడా ఫ్లాపుల్లో ఉండబట్టి రామ్ ఒప్పుకున్నాడు. ఇక ఇస్మార్ట్ శంకర్ కథ కూడా చాలా మందికి చెప్పాడు.
అసలు ఆ చిత్రాన్ని క్రేజీ హీరో విజయదేవరకొండతో చేయాలని ప్లాన్ కానీ విజయ్ ఒప్పుకోలేదు. ఇక ఎంత ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ ఆయన తన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మాత్రం కోల్పోలేదు. పూరి జగన్నాధ్ డైరెక్టర్ అవ్వడం వల్ల వాళ్ళ కుటుంబ సభ్యులను కూడా బయట జనాలు కొన్ని సందర్భాల్లో టార్గెట్ చేసి కాస్త అసభ్య వ్యాఖ్యలు కూడా చేసిన దాఖలాలు ఉన్నాయి. ఇది కేవలం ఆయన డైరెక్టర్ కావడంతో అలాంటి అవమానాలకు గురికావల్సి వచ్చింది. 20 ఏళ్ళ కెరియర్లో ఎవ్వరూ సంపాదించనంత క్రేజ్ అంత ఫాస్ట్గా సంపాదించాడు పూరి. అయితే తనతో కలిసి కనీసం ఒక్క సినిమా అన్నా చేయాలనుకున్న హీరోలు. తర్వాత మొహం చాటేశారు. పూరిజగన్నాధ్ లైఫ్లో ఉన్నంత ట్రాజడీ ఇంకెవ్వరి లైఫ్లో లేదు. కానీ పూరి మాత్రం ఎంతో గుండెనిబ్బరంతో అలానే ఉండిపోయారు.