స్టార్ హీరోలు వెండితెరపై ఓ రేంజ్ లో ఫైట్ చేసినా.. తెర వెనుక మాత్రం ఆప్యాయతలు అనురాగాలకు ప్రతీకగా నిలుస్తారు. అయితే చాలా మంది కథానాయకులు ఈ విధానాన్ని పెద్దగా బయటికి చూపించరు. కానీ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తీరు మాత్రం చాలా ప్రత్యేకత. తన ఫ్రెండ్ షిప్ ను ఓ రేంజ్ లో ఎక్స్ ఫోజ్ చేస్తున్నాడు. ఫ్యాన్స్ మధ్య స్నేహభావం పెంచే విధంగా ప్రవర్తిస్తున్నాడు. 

 

మెగా హీరోలకు ఒక అభిమాన సంఘం.. నందమూరి స్టార్లకు ఒక అభిమాన సంఘం.. మహేశ్ బాబుకు ఒక అభిమాన సంఘం ఇలా ప్రతీ హీరోకు ఓ అభిమాన సంఘం ఖచ్చితంగా ఉంటుంది. తమ హీరో గ్రేట్ అంటే తమ హీరో గొప్ప అంటూ నానా హంగామా చేస్తుంటారు. తమ అభిమాన హీరో సినిమా వచ్చినప్పుడల్లా థియేటర్ల వద్ద సందడంతా వాళ్లదే. కటౌట్స్ కట్టడం మొదలుకొని సినిమా బ్లాక్ బస్టర్ అయ్యే వరకు బాధ్యత అంతా వాళ్లదే. అలాంటి వాళ్ల మధ్య సాధారణ పరిస్థితులు నెలకొనేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాడు రామ్ చరణ్. తనలాంటి స్టార్ హీరోలతో కలిసి వరుస సినిమాలు చేస్తూ తామందరం ఒక్కటే.. మీరు కూడా అలానే మెలగాలి అనే సందేశాన్ని ఇస్తున్నాడు. 

 

నందమూరి, మెగా అభిమానుల మధ్య రికార్డుల గొడవ ఇప్పటికాదు. చాలా రోజుల నుంచి నడుస్తోంది. అయితే ట్రిపుల్ ఆర్ మూవీతో ఈ గొడవకు ఫుల్ స్టాప్ పడేలా ప్లాన్ చేశారు చరణ్, తారక్. తెర వెనుక బెస్ట్ ఫ్రెండ్స్ అయిన వీళ్లు రాజమౌళి డైరెక్షన్ లో నటిస్తున్నారు. మాటలతో పోట్లాడుకోకుండా కలిసి మెలిసి జీవించాలనే సందేశాన్ని ఇస్తున్నారు. అలాగే రామ్ చరణ్ నిర్మాణంలో వస్తోన్న ఆచార్యలో మహేశ్ బాబు నటిస్తాడని అప్పట్లో ప్రచారం జరిగింది. హీరోలే కలిసి నటిస్తున్నపుడు ఫ్యాన్స్ కు మధ్య విభేదాలుండకూదనే సందేశం వస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: