ప్రస్తుతం టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ కేవలం టాలీవుడ్ లో మాత్రమే కాదు నేషనల్ హీరో అని చెప్పాలి. ఎందుకంటే బాహుబలి సాహు లాంటి చిత్రాల తర్వాత టాలీవుడ్ లో కంటే బాలీవుడ్ లోనే ప్రభాస్ కి ఎక్కువ క్రేజ్ పెరిగిపోతోంది. సాహో చిత్రానికి తెలుగు చిత్ర పరిశ్రమ కంటే బాలీవుడ్ లో ఎక్కువ వసూలు వచ్చాయి అంటే ప్రభాస్ క్రేజ్ ఎంత  పెరిగిపోయింది అర్థం చేసుకోవచ్చు. అంతేకాకుండా రెబల్ స్టార్ ప్రభాస్ కటౌట్ కి కూడా చాలా మంది బాలీవుడ్ అభిమానులు ఫిదా అయిపోయారు. ఇక దర్శక నిర్మాతల కన్ను కూడా ప్రభాస్ పై పడింది. దీంతో ప్రభాస్ కోసం ఏకంగా కథలను కూడా సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. 

 

 

 అయితే ప్రస్తుతం టాలీవుడ్ కంటే బాలీవుడ్ లోనే ఎక్కువ మార్కెట్ను సంపాదించుకుంటున్నాడు రెబల్ స్టార్ ప్రభాస్. ఇక ప్రభాస్ సినిమా వస్తుందంటే అటు బాలీవుడ్ ప్రేక్షకులు కూడా ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం రెబల్ స్టార్ ప్రభాస్ కి ఒక బంపర్ ఆఫర్ వచ్చినట్టు తెలుస్తోంది. ప్రభాస్ కు బాలీవుడ్ స్టార్ నిర్మాత ఆదిత్య చోప్రా సూపర్ ఆఫర్ ఇచ్చినట్లు సమాచారం. బాహుబలి సాహూ లాంటి సినిమాలు చూసిన తర్వాత యాక్షన్ సినిమాలకు ప్రభాస్ బాగా సెట్ అవుతాడు అని భావించిన నిర్మాత ఆదిత్య చోప్రా... తాను నిర్మించబోయే ధూమ్-4 చిత్రంలో విలన్ పాత్ర కోసం ప్రభాస్ ని తీసుకోవాలని భావిస్తున్నారట. 

 

 

 అయితే ఇప్పటికే ధూమ్ సిరీస్ లో వచ్చిన మూడు సినిమాలు ఎంతటి ఘన విజయాన్ని సాధించాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. జాన్ అబ్రహం హృతిక్ రోషన్ అమీర్ ఖాన్ లాంటి హీరోలు ధూమ్ 3 సిరీస్ లలో విలన్ పాత్రల్లో  నటించారు. ప్రస్తుతం అలాంటి ఆఫర్ను నిర్మాత ప్రభాస్ కు  ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఇక దీని కోసం ప్రభాస్ ని ఒప్పించే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయట. అయితే ప్రభాస్ నుంచి ఇంకా సమాధానం ఏమీ రాలేదు అన్నట్లుగా సమాచారం. ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న సినిమా పూర్తి అయితే నాగ్ అశ్విన్ తో మరో సినిమా లైన్లో ఉంది. ఈ సినిమా 2022 సంక్రాంతికి వచ్చే అవకాశం ఉంది. అయితే ధూమ్ సినిమా వార్త  ఎంతవరకు నిజం అనేది మాత్రం తెలియాలంటే  అధికారిక ప్రకటన రావాల్సివుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: