మాస్ మహారాజా రవితేజ వరుస ప్లాపులతో సతమతం అవుతున్నాడు. అంతకుముందు చాలా లాంగ్ గ్యాప్ తీసుకుని 'రాజా ది గ్రేట్' సినిమా తో అదిరిపోయే విజయాన్ని సాధించటం మనకందరికీ తెలిసిందే. అయితే ఆ తర్వాత రవితేజ నటించిన అన్ని సినిమాలు కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర అట్టర్ ఫ్లాప్ అయ్యాయి. మినిమమ్ గ్యారంటీ హీరోగా ఇండస్ట్రీలో పేరున్న రవితేజ మార్కెట్ రోజు రోజుకి డ్యామేజ్ అవ్వుతూ వస్తుంది. గత మూడేళ్లలో రవితేజ నటించిన ‘టచ్ చేసి చూడు’, ‘నేల టికెట్టు’, ‘అమర్ అక్బర్ ఆంటోనీ’, ‘డిస్కో రాజా’ లాంటి పెద్ద డిజాస్టర్లు ఖాతాలో వేసుకున్నాడు. ప్రస్తుతం రవితేజ ఆశలన్ని ‘క్రాక్’ మీదే ఉన్నాయి.

 

సినిమా డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న నేపద్యంలో సినిమాపై అంచనాలు అభిమానులకు ఓ రేంజ్ లో ఉన్నాయి. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో 'డాన్ శీను', 'బలుపు' వంటి రెండు బ్లాక్ బస్టర్ సినిమాలు రావటం జరిగాయి. దీంతో ‘క్రాక్’ సినిమా గ్యారెంటీగా హిట్ అవుతుందని అభిమానులు అనుకుంటున్నారు. పైగా గోపీచంద్ మలినేని రవితేజ అభిమాని కావటంతో ఈ సినిమాతో రవితేజ కి బ్రేక్ ఇస్తారని అందరూ భావిస్తున్నారు. ఇటువంటి సమయంలో రవితేజ అభిమానులకు ఒక బ్యాడ్ న్యూస్ ఇండస్ట్రీ నుండి వినబడుతోంది.

 

అదేమిటంటే తన కెరియర్ కి ఎంతో లక్ గా ఉండే మాస్ నేపధ్యం లో ఉన్న సినిమా స్టోరీ ఓ ప్రముఖ డైరెక్టర్ తో రవితేజ ఒప్పుకున్నాడట. వైరస్ రాకముందు రవితేజ ఈ సినిమాకి చేయడానికి అంత కూడా ఒకే అయిందట. అయితే ‘లాక్ డౌన్’ తర్వాత పరిస్థితులు తర్వాత పూర్తిగా ఇండస్ట్రీలో పరిస్థితులు మారిపోవడంతో ఈ సినిమా క్యాన్సిల్ అయిపోయినట్లు సమాచారం. బడ్జెట్ సమస్యల వల్ల ప్రొడ్యూసర్ కోనేరు సత్యనారాయణ తప్పుకున్నారట. దీంతో చేస్తున్న సినిమాలు ఒకపక్క బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడుతూ ఉంటే మరోపక్క ఒప్పుకున్న సినిమాలు కూడా క్యాన్సిల్ అవటం రవితేజ కెరీర్ కి సంబంధించి ఫ్యాన్స్ కి బ్యాడ్ న్యూస్ మీద బ్యాడ్ న్యూస్ అని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: