పవన్ కళ్యాణ్ నటించిన చివరి సినిమా 'అజ్ఞాతవాసి'. 2018 వ సంవత్సరం లో రిలీజ్ అయిన ఈ సినిమా అట్టర్ ఫ్లాప్ అయ్యింది. త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా తర్వాత పూర్తిగా రాజకీయాలకు పరిమితమయ్యారు పవన్. జనసేన పార్టీ వ్యవస్థాపకుడిగా ఆ టైంలో ఏపీ రాజకీయాల్లో కీలకంగా రాణించారు. మొట్టమొదటిసారి 2019 ఎన్నికల్లో పోటీ చేసి పవన్ కళ్యాణ్ ఓడిపోయారు. ఇటువంటి సమయములో ఇంకా సినిమాలు చేయను అని చెప్పిన పవన్ అటు రాజకీయంగా ఓడిపోవడంతో మెగా అభిమానులు ఫుల్ నిరుత్సాహానికి గురయ్యారు.

 

ఇదిలా ఉండగా ఇటీవల మళ్లీ పవన్ కళ్యాణ్... సినిమా రంగంలోకి రీ ఎంట్రీ ఇవ్వటంతో అభిమానులు ఫుల్ జోష్ లో ఉన్నారు. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ‘వకీల్ సాబ్’ అనే సినిమాతో పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ ఇస్తున్నారు. చాలా గ్యాప్ తర్వాత పవన్ కళ్యాణ్ సినిమా వస్తున్న తరుణంలో సినిమాపై అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. ఇంకా కొద్ది షూటింగ్ బ్యాలెన్స్ మాత్రమే మిగిలి ఉండటంతో సినిమా రిలీజ్ కోసం అభిమానులు ఎంతగానో ఆశగా ఎదురు చూస్తున్నారు. ఇదే సమయంలో పవన్ కళ్యాణ్... డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో కూడా భారీ బడ్జెట్ సినిమా ఒప్పుకున్న విషయం అందరికీ తెలిసిందే.

 

లాక్ డౌన్ కారణంగా ఈ సినిమా షూటింగ్ గురించి రకరకాల వార్తలు సోషల్ మీడియాలో ఇటీవల వచ్చాయి. అయితే తాజాగా ఈ సినిమా షూటింగ్ జూలై నెల నుండి స్టార్ట్ అవ్వబోతున్నట్లు ఫిలిం నగర్ టాక్. జూన్ నెల నుండి సినిమా షూటింగ్ లు మొత్తం ప్రారంభం అయ్యే అవకాశం ఉండటంతో ముందుగా “వకీల్ సాబ్” సినిమా షూటింగ్ పూర్తి చేసి ఆ తర్వాత డైరెక్టర్ క్రిష్ ప్రాజెక్టు పవన్ కళ్యాణ్ మొదలు పెట్టనున్నట్లు సమాచారం.  

మరింత సమాచారం తెలుసుకోండి: