మాస్ రాజా రవితేజ లేటెస్ట్ మూవీ క్రాక్ డైరెక్ట్ గా డిజిటల్  రిలీజ్ కానుందని కొద్దీ రోజులనుండి వార్తలు వస్తున్నాయి ఇక రవితేజ కూడా డైరెక్ట్ ఓటిటి రిలీజ్ కు ఓకే చెప్పాడని దాంతో త్వరలోనే ఈసినిమా ఓటిటిలో విడుదలకానుందని ప్రచారం జరుగుతుంది అయితే దీని గురించి నిర్మాత ఠాగూర్ మధు తాజాగా క్లారిటీ ఇచ్చాడు. సినిమాను మొదట థియేటర్లలోనే విడుదలచేస్తాం.. డైరెక్ట్ డిజిటల్ రిలీజ్ వార్తల్లో నిజం లేదు. ఇంకా 15రోజుల షూటింగ్ బ్యాలన్స్ వుంది అయితే షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో చెప్పలేం అని మధు వివరణ ఇచ్చాడు.
 
గోపిచంద్ మలినేని డైరెక్షన్ లో యాక్షన్ ఎంటరైనర్ గా తెరకెక్కుతున్న ఈచిత్రంలో రవితేజ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనుండగా అతనికి జోడిగా శృతిహాసన్ నటిస్తుంది అలాగే తమిళ నటి వరలక్ష్మి శరత్ కుమార్ ప్రతినాయకురాలి పాత్రలో కనిపించనుంది. థమన్ సంగీతం అందిస్తున్నాడు కాగా గోపిచంద్ తో రవితేజ కు ఇది మూడో సినిమా. ఇంతకుముందు వీరి కాంబోలో వచ్చిన డాన్ శీను యావరేజ్ అనిపించుకోగా బలుపు సూపర్ హిట్ అయ్యింది. 
 
 
ఇక క్రాక్ తరువాత రవితేజ.. రమేష్ వర్మ, త్రినాథరావు నక్కినతో సినిమాలు చేయనున్నాడు. వీటిలో త్రినాథరావు సినిమా ముందుగా సెట్స్ మీదకు వెళ్లనుంది. చంటబ్బాయ్ తరహాలో అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్ గా ఈ సినిమా తెరకెక్కనుందని సమాచారం. ప్రస్తుతం ఈ చిత్రానికి హీరోయిన్ ను వెతుకుతున్నారు. ఇక వీర తరువాత రమేష్ వర్మతో మరోసినిమా చేయనున్నాడు రవితేజ. కోనేరు సత్యనారాయణ ,హవీష్ నిర్మించనున్న ఈచిత్రంలో నాబా నటేష్ ఓ కథనాయికగా నటించనుందని టాక్. వచ్చే ఏడాది ప్రారంభంలో ఈచిత్రం సెట్స్ మీదకు వెళ్లనుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: