మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం తన152 వ సినిమా ని కొరటాల శివ దర్శకత్వంలో చేస్తున్నాడు. ఈ సినిమా కి ఆచార్య అనే టైటిల్ ఖరారు చేస్తూ, ఇటీవలే చిరు పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన మోషన్ పోస్టర్ కి ప్రేక్షకుల నుండి భారీ రెస్పాన్స్ వచ్చింది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశ లో ఉంది. అయితే ఈ సినిమా తరువాత చిరంజీవి లూసిఫార్ రీమేక్ లో నటిస్తాడాని వార్తలు వస్తున్నాయి.ఇదిలా ఉండగా ఇక తాజా గా చిరు,దర్శకుడు మెహర్ రమేష్ డైరెక్షన్లో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ విషయాన్ని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన పుట్టినరోజు సందర్భంగా ట్విట్టర్ లో స్వయంగా ప్రకటించారు. దీంతో ఈ ప్రాజెక్టు ఓకే అయినట్టు తెలుస్తోంది. ఇక ఈ సినిమా కూడా ఓ తమిళ చిత్రానికి రీమేక్ గా రానుందట. తమిళంలో అజిత్ హీరో గా వేదాలం సినిమా వచ్చింది.


సినిమా కోలీవుడ్ లోమంచి విజయాన్ని సాధించింది. ఇప్పుడు అదే సినిమా ని చిరు కోసం మెహర్ రమేష్ కొన్ని మార్పులు, చేర్పులు చేసి తీస్తున్నాడు. తాజాగా ఈ ప్రాజెక్టుకి సంబంధించిన ఓ వార్త ఫిల్మ్ నగర్ లో చక్కర్లు కొడుతోంది. అదేంటంటే మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కనున్న వేదాళం తెలుగు రీమేక్ లో సాయిపల్లవి, చిరంజీవి సోదరిగా కనిపించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఈ మేరకు చిత్ర దర్శకుడు మెహెర్ రమేష్ సాయి పల్లవి ని సంప్రదించారని టాక్. ఇప్పటికే స్క్రిప్టు పనులు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఆచార్య షూటింగ్ ముగిసిన అనంతరం పట్టాలెక్కనుంది.


 ఐతే ఈ సినిమా విషయమై ఇప్పటి వరకు అధికారిక సమాచారం రానప్పటికీ పవన్ కళ్యాణ్ పుట్టినరోజుని పురస్కరించుకుని విషెస్ తెలియజేసిన మెహెర్ రమేష్ కి దన్యవాదాలు తెలిపిన పవన్ కళ్యాణ్, ఈ సినిమా గురించి ప్రస్తావించడంతో అభిమానులు కన్ఫర్మ్ చేసుకున్నారు.ఇక సాయి పల్లవి ప్రస్తుతం మూడు సినిమాలతో బిజీ బిజీగా వుంది. తెలుగులో నాగచైతన్య సరసన లవ్ స్టొరీ, రానా సరసన విరాట పర్వం, మరియు తమిళ్ లో ఓ సినిమా చేస్తోంది. మరి ఇప్పుడు మెగాస్టార్ సినిమా లో కనుక ఈ అమ్మడు నటిస్తే ఈమెకు పెద్ద బ్రేక్ రావడం ఖాయం అంటున్నాయి సినీ వర్గాలు.

మరింత సమాచారం తెలుసుకోండి: